ఎయిర్ అంబులెన్సులో జపాన్ నుంచి గుజరాత్కు!
ఉపాధి కోసం జపాన్ వెళ్లి అక్కడే టీబీ బారిన పడి.. బ్రెయిన్ స్ట్రోక్తో ఎనిమిది నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతీయుడిని ఎట్టకేలకు స్వదేశం తీసుకొచ్చారు. నెటిజన్ల విరాళాలు, ప్రభుత్వ సహకారంతో అతడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా జపాన్ నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ ప్రైవేటు
అహ్మదాబాద్: ఉపాధి కోసం జపాన్ వెళ్లి అక్కడే టీబీ బారిన పడి.. బ్రెయిన్ స్ట్రోక్తో ఎనిమిది నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతీయుడిని ఎట్టకేలకు స్వదేశం తీసుకొచ్చారు. నెటిజన్ల విరాళాలు, ప్రభుత్వ సహకారంతో అతడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా జపాన్ నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే..
గుజరాత్కు చెందిన జయేశ్ పటేల్(33) 2018లో భార్యతో కలిసి ఉపాధి నిమిత్తం జపాన్కు వెళ్లాడు. అతడి భార్య గర్భం దాల్చడంతో అదే ఏడాది తిరిగి స్వగ్రామానికి చేరుకుంది. ఆ తర్వాత జయేశ్ కూడా కొన్నాళ్లకు తిరిగి భారత్కు వద్దామనుకున్నా కరోనా, లాక్డౌన్తో రాలేకపోయాడు. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్ నెలలో అతడికి టీబీ సోకింది. ఆ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అక్కడి స్థానికులు జయేశ్ను ఒటా నగరంలోని షిబుకవా ఆస్పత్రిలో చేర్చారు. గత ఎనిమిది నెలలుగా జయేశ్ అక్కడే చికిత్స పొందుతున్నాడు. జయేశ్ ఆస్పత్రిపాలైన విషయం తెలిసి అతడి తండ్రి జపాన్కు వెళ్లారు. తన కుమారుడిని తిరిగి భారత్కు తీసుకొచ్చి చికిత్స కొనసాగించాలని భావించారు. కానీ, జయేశ్ను జపాన్ నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు వారి ఆర్థిక స్థోమత సరిపోలేదు.
దీంతో జయేశ్ కుటుంబసభ్యులు, స్నేహితులు సోషల్మీడియాలో ‘ఐ సపోర్ట్ జయేశ్ పటేల్’ పేరుతో ఫండ్ రైజింగ్ ప్రారంభించారు. జయేశ్ను భారత్కు తీసుకొచ్చి, చికిత్స అందించడానికి రూ.1.2కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. కాగా.. నెటిజన్లు స్పందించి తమ వంతు విరాళాలు ఇచ్చారు. అలా రూ. 41లక్షలు సమకూరడంతో జపాన్, భారత ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకొని జయేశ్ను సోమవారం ఒటా నుంచి ప్రత్యేక ఎయిర్ అంబులెన్సులో దిల్లీకి తరలించారు. అక్కడి నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్కు తీసుకొచ్చి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. జపాన్ వైద్యుల సూచన మేరకు అహ్మదాబాద్ నుంచే ఒక వైద్య బృందం అక్కడికి వెళ్లి జయేశ్ ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించింది. అనంతరం ఆ వైద్య బృందం ఆధ్వర్యంలోనే జయేశ్ను అహ్మదాబాద్ తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్చారు. జయేశ్ ఆరోగ్య పరిస్థితి చూసి అతడి కుటుంబసభ్యులు ఆందోళన పడుతున్నా తిరిగి తమ చెంతకు చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. విరాళాలు ఇచ్చి జయేశ్ను తిరిగి భారత్కు తీసుకురావడంలో సహాయపడ్డ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.