ICSE ‘పది’ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఐసీఎస్‌ఈ బోర్డు పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ పరీక్షలు మే 5 నుంచి ప్రారంభం కానున్నట్టు ద కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌.....

Published : 01 Mar 2021 20:51 IST

దిల్లీ: ఐసీఎస్‌ఈ బోర్డు పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 5 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్టు ద కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ (సీఐఎస్‌సీఈ) వెల్లడించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆఫ్‌లైన్‌ ద్వారా మే 5 నుంచి ప్రారంభం కాబోయే ఈ పరీక్షలు జూన్‌ 7 వరకు కొనసాగనున్నాయి. మే 5న ఉదయం 11 గంటలకు ఇంగ్లీష్‌ పేపర్-1తో ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నాపత్రాన్ని 15 నిమిషాల ముందుగానే విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. 

షెడ్యూల్‌ ఇదీ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని