Weather: ఉత్తరాది గజగజ.. మరో రెండు రోజులు ఇంతే..!
ఉత్తరాదిలో చలిప్రభావం మరో రెండు రోజులు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
దిల్లీ: ఉత్తరాదిన (North India)చలి గజగజ వణికిస్తోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇదే పరిస్థితులు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. భారత్ (India) లోని ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. పశ్చిమ వైపు నుంచి వీచే వేడిగాలుల వల్ల జనవరి 10 తర్వాత పంజాబ్, హరియాణాతో పాటు పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని తెలిపింది. మరోవైపు ఆది, సోమవారాల్లో దిల్లీ, పంజాబ్, చండీగఢ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
సోమవారం తర్వాత బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్, విదర్భ, చత్తీస్గఢ్, పశ్చిమ మధ్యప్రదేశ్, తెలంగాణ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో దిల్లీ, పంజాబ్, హరియాణా, చత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్తోపాటు రాజస్థాన్లోని ఉత్తరభాగంలో దట్టమైన పొగమంచుకురిసే అవకాశముందని తెలిపింది. జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బిహార్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర తదితర రాష్ట్రాల్లోనూ పొగమంచు ప్రభావం ఉంటుందని చెప్పింది. అరేబియా సముద్రం మీదుగా వీచే గాలుల వల్ల జనవరి 10 నుంచి 13 తేదీల మధ్య పశ్చిమ హిమాలయ రీజియన్లో కొన్ని చోట్లు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.