Early Warning Systems: ‘ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’.. ఐదు దేశాలకు భారత్ సాంకేతిక సాయం
ప్రకృతి విపత్తుల సమయంలో ముందే ప్రజలను హెచ్చరించేలా ఓ వ్యవస్థను రూపొందించుకుంటున్న ఐదు దేశాలకు భారత్ సాయం చేస్తోందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి విపత్తుల సమయంలో ముందే ప్రజలను హెచ్చరించేలా ఓ వ్యవస్థను రూపొందించుకుంటున్న ఐదు దేశాలకు భారత్ సాయం చేస్తోందని ‘భారత వాతావరణ విభాగం’ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర (Mrutyunjay Mohapatra) వెల్లడించారు. పీటీఐ వార్తాసంస్థ ప్రతినిధులకు ఆయన ఈవిషయాన్ని తెలిపారు. ‘ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’ను తయారుచేసుకుంటున్న నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, మారిషస్లకు భారత్ సాంకేతిక సాయం అందిస్తోందని వెల్లడించారు.
ఐరాస హెచ్చరిక
ప్రకృతి విపత్తుల ప్రభావం నుంచి ఈ దేశాలను రక్షించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ప్రమాదకర వాతావరణం, నీరు, వాతావరణ విపత్తుల నుంచి రక్షణ కోసం 2027 నాటికి ‘ముందస్తు హెచ్చరికల వ్యవస్థ’లను రూపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి 2022లో ప్రకటించింది. ‘ఎర్లీ వార్నింగ్స్ ఫర్ ఆల్’ ప్రక్రియలో భాగంగా చొరవ తీసుకున్న భారత్ ఆ దిశగా గట్టి కసరత్తు చేస్తోంది.
‘‘50 శాతం దేశాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేదు. దీని కారణంగా పేద దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు, ద్వీప దేశాలు ఆస్తి, ప్రాణ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాలకు ఆర్థిక, సాంకేతిక మద్దతు అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవస్థ అవసరమున్న 30 దేశాల్లో ఐదింటికి భారత్ సహకారం అందిస్తోంది. ఆయా దేశాల్లో వాతావరణ పరిశీలనా కేంద్రాల ఏర్పాటుకు సాయం చేస్తాం. ఐఎండీ అంచనాలు, డేటా మార్పిడి, హెచ్చరిక వ్యాప్తి కోసం సంబంధిత దేశాల మంత్రిత్వ శాఖలతో కలసి పనిచేస్తున్నాం’’ అని మృత్యుంజయ్ పేర్కొన్నారు.
ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) డిసెంబరులో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 52 శాతం దేశాలు (101 దేశాలు) బహుళ ప్రమాదకర ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను కలిగిఉన్నాయి. 1970 నుంచి 2021 వరకు దాదాపు 12 వేల ప్రకృతి విపత్తులు సంభవించాయి. దీని ఫలితంగా రెండు మిలియన్లకు పైగా మరణాలు 4.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. 2015 నుంచి 2022 మధ్య 41 వేల మంది విపత్తు కారణంగా మరణించినట్లు నివేదిక పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్పై ‘సుప్రీం’ తీర్పు రిజర్వు
తన అరెస్టును సవాల్ చేస్తూ దిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. -
కేజ్రీవాల్ ఇంటి నుంచి వీడియో వెలుగులోకి.. ‘హిట్మ్యాన్’ అంటూ స్వాతీమాలీవాల్ పోస్టు
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసంలోనివిగా భావిస్తోన్న కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై స్వాతీమాలీవాల్ స్పందించారు. -
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్పై జరిగిన భౌతిక దాడి సిగ్గుచేటని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు. -
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ
ఆ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖలో టెండర్ దక్కాలంటే మంత్రిగారికి 1.5శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనంట. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ ఈడీ కోర్టుకు వెల్లడించింది. -
మోదీపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు అర్థం లేనివి: రాజ్నాథ్ సింగ్
ప్రధాని మోదీపై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. -
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
అతడు నా ఛాతి, కడుపుపై కాలితో తన్నాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబయి..
-
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ఈసీ
-
శిఖర్ పహారియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
-
వీసా లేకుండా పర్యటనల కోసం.. భారత్, రష్యా త్వరలో చర్చలు!
-
అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్పై ‘సుప్రీం’ తీర్పు రిజర్వు
-
కోహ్లీకి కలిసొచ్చే ‘నంబర్ 18’.. ఆర్సీబీని ప్లేఆఫ్స్కు చేరుస్తుందా?