Narendra Modi : ఆదివాసీ సేవలో విరిసిన ‘పద్మా’లు: మోదీ
ఈ ఏడాది పద్మా అవార్డుల్లో ఆదివాసులకు సేవ చేసిన వారికి ఎక్కువగా దక్కాయని ప్రధాని మోదీ అన్నారు. 2023 తొలి మన్కీ బాత్లో ఆయన మాట్లాడారు.
ఇంటర్నెట్డెస్క్: 2023 సంవత్సరాన్ని ‘పీపుల్స్ పద్మ’ ఏడాదిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయన 2023లో తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆదివారం మాట్లాడారు. ‘‘ఆదివాసీ వర్గాలకు లేదా ఆదివాసుల అభివృద్ధికి కృషి చేసిన వారికి ఈ సారి చెప్పుకోదగ్గ స్థాయిలో పద్మా అవార్డులు లభించాయి. సాధారణ నగర జీవితాలకు ఆదివాసీల జీవితాలు చాలా భిన్నంగా ఉంటాయి. వారికి భిన్నమైన సవాళ్లు ఎదురవుతాయి. కానీ, వారి సంస్కృతిని కాపాడుకొంటారు. చాలా మంది గొప్ప వ్యక్తులు ఆదివాసుల భాషలపై పరిశోధనలు చేసి పద్మా సత్కారాన్ని అందుకొన్నారు. ఇది మనందరికీ గర్వకారణం. సిద్ధి, జార్వా, ఆంగే జాతులతో కలిసి పనిచేసన వారికి కూడా ఈ సారి అవార్డులు లభించాయి. దీంతోపాటు నక్సలైట్ ప్రాంతాల్లో పద్మా ప్రతిధ్వనులు వినిపించాయి. అక్కడ దారితప్పిన యువతను సన్మార్గంలో నడిపిన వారికి కూడా ఇవి లభించాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
దేశంలో చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించేవారిని కూడా ప్రధాని అభినందించారు. ‘‘మనం ఎప్పుడైన మిల్లెట్ప్రెన్యూర్స్ అనేది విన్నామా..? ఒడిశాలో మిల్లెట్ప్రెన్యూర్స్ వార్తల్లో నిలిచారు. సుందర్గఢ్ జిల్లాలో ఒక మహిళా స్వయం సహాయక బృందం చిరుధాన్యాలను ఆ రాష్ట్ర మిల్లెట్ మిషన్తో కలిసి పనిచేస్తోంది. వారు చిరుధాన్యాలతో బిస్కెట్లు, కేకులు, తినుబండారాలను తయారు చేసి విక్రయిస్తున్నారు’’ అని ప్రధాని మోదీ చెప్పారు. ఆరోగ్య రంగంలో పెనుమార్పులు చోటు చేసుకొంటున్నాయన్నారు. యోగా డే, ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ప్రచారంలో ప్రజల భాగస్వామ్యాన్ని చూస్తే ఇది అర్థమవుతోందన్నారు.
ఇ-వేస్ట్ పై ప్రధాని మాట్లాడుతూ నేటి అత్యాధునిక పరికరాలే రేపటి ఇ-వ్యర్థాలుగా మారతాయన్నారు. కొత్త పరికరాలు కొన్నప్పుడు పాతవాటిని సరైన పద్దతిలో వదిలించుకోవాలని సూచించారు. ఐరాస లెక్కల ప్రకారం 50 మిలియన్ టన్నుల ఇ-వేస్ట్ను ఎక్కడ పడితే అక్కడ పారేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..