International Flights: రెండేళ్ల విరామం తర్వాత.. అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ..!
కొవిడ్ కన్నా ముందు మాదిరిగానే అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు యథావిధిగా నడిచేందుకు గానూ ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఆంక్షలు సడలించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ
దిల్లీ: యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అదుపులోనే ఉండడం, వ్యాక్సిన్ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కన్నా ముందు మాదిరిగానే అన్ని సర్వీసులు యథావిధిగా నడిచే విధంగా ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆంక్షల సడలింపు ఆదివారం నుంచే అమలులోకి వచ్చిందని వెల్లడించింది. దీంతో గత రెండేళ్లుగా బ్రేక్ పడిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు తిరిగి రెక్కలు వచ్చినట్లు అయ్యింది.
ఇక విమానాశ్రయాలు, విమానాల్లో ఇంతకుముందు విధించిన కొవిడ్ నిబంధనలనూ పౌరవిమానయాన శాఖ సడలించింది. ముఖ్యంగా విమాన సిబ్బంది పీపీఈ కిట్లను ధరించాల్సిన అవసరం లేదు. కానీ, ఎయిర్పోర్టులు, విమానాల్లో మాస్కులు ధరించడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం వంటివి తప్పనిసరి చేసింది. అంతేకాకుండా అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో అత్యవసర విభాగం కింద మూడు సీట్లను ఖాళీగా ఉంచాలని విమానయాన సంస్థలకు సూచించింది. వీటితోపాటు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మారిషస్, మలేషియా, థాయిలాండ్, టర్కీ, అమెరికా, ఇరాన్తోపాటు దాదాపు 40దేశాలకు చెందిన 60 విమానయాన సంస్థలు భారత్కు సర్వీసులు నడిపేందుకు మార్గం సుగమమైంది. దీనిపై వెంటనే స్పందించిన ఇండిగో ఎయిర్లైన్స్.. కువైట్, అబుదాబీ, షార్జా, జెడ్డా, రియాద్, దోహా, బ్యాంకాక్తోపాటు ఇతర దేశాల్లోని 150 రూట్లలో అంతర్జాతీయ సర్వీసులను త్వరలోనే పునఃప్రారంభిస్తామని ప్రకటించింది.
ఇదిలాఉంటే, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి కారణంగా అంతర్జాతీయ విమానాలపై గత రెండేళ్లుగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఏఈ ఇలా.. సుమారు 28 దేశాలతో (Air Bubble) ఒప్పందం కుదుర్చుకున్న భారత ప్రభుత్వం.. ఆయా దేశాలకు ప్రత్యేక విమానాలను నడుపుతోంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోన్న ప్రభుత్వం పూర్తిస్థాయి అంతర్జాతీయ విమానాలను గతేడాది ప్రారంభించాలని భావించినప్పటికీ.. ఒమిక్రాన్ కారణంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడం, వివిధ దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నందున అంతర్జాతీయ విమాన సర్వీసులను యథావిధిగా తిరిగి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.