Border: చైనా సరిహద్దుల్లో మరో 50 వేల మంది సైనికులు
ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాను ధీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా భారత్ చర్యలు చేపడుతోంది. ఈమేరకు సరిహద్దుల వద్ద డ్రాగన్ చర్యల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా అదనంగా 50 వేల మంది సైనికుల్ని....
డ్రాగన్ ఆగడాలను అడ్డుకోవడమే లక్ష్యంగా మోహరింపులు
చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తొలగని వేళ భారత్ పూర్తి అప్రమత్తతను ప్రదర్శిస్తోంది. ఇదివరకు చైనా సైన్యాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఉన్న భారత్.. అవసరమైతే దాడి చేసేలా వనరులు పెంచుకుంటోంది. ఇందుకోసం అదనంగా 50 వేల మంది సైనికులను చైనా సరిహద్దుల వద్ద భారత్ మోహరించినట్లు బ్లూమ్బర్గ్ పేర్కొంది. గతేడాది లెక్కలతో పోలిస్తే ఇప్పుడున్న దళాల సంఖ్య 40 శాతం అధికం. అటు సముద్ర జలాల్లోనూ చైనాపై నిఘా పెంచేందుకు భారత నావికాదళం సైతం చర్యలు చేపట్టింది.
దిల్లీ: ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాను ధీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా భారత్ చర్యలు చేపడుతోంది. ఈమేరకు సరిహద్దుల వద్ద డ్రాగన్ చర్యల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా అదనంగా 50 వేల మంది సైనికుల్ని, యుద్ధ విమానాల్ని చైనా సరిహద్దుల వద్ద భారత్ మోహరించినట్లు ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్బర్గ్ పేర్కొంది. ప్రస్తుతం చైనా సరిహద్దుల్లో భారత సైనికులు 2 లక్షల మంది పహారా కాస్తున్నారు. ఇది 2020 నాటి లెక్కలతో పోలిస్తే 40 శాతం కన్నా అధికం. ఇదివరకు చైనా ఆగడాలను అడ్డుకోవడమే లక్ష్యంగా సైనిక మోహరింపులు ఉండేవి. అయితే ఆ విధానానికి స్వస్తి పలుకుతూ భారత్ ముందుకుసాగుతోంది. డ్రాగన్ సైన్యాన్ని అడ్డుకోవడమే కాకుండా.. అవసరమైతే దాడి చేసేలా భారత్ వ్యవహరిస్తోందని బ్లూమ్బర్గ్ ఓ నివేదికలో పేర్కొంది.
సరిహద్దుల్లోకి మరిన్ని బలగాలను మోహరించడం ద్వారా.. హిమాలయాల్లో చైనాను ఢీకొట్టేలా సైనికులు అలవాటు పడేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రవేశపెట్టిన రఫేల్ సహా, ఫైటర్ జెట్లను సైతం చైనా సరిహద్దు వెంబడి మూడు విభిన్న ప్రాంతాలకు తరలించారు. సముద్ర మార్గం గుండా చైనా నుంచి బయటకొచ్చే వనరులు, వాణిజ్య పరమైన అంశాలపై నిఘా ఉంచేందుకు భారత నావికాదళం సైతం యుద్ధ నౌకల్ని మోహరిస్తోంది. గల్వాన్ లోయలో గతేడాది జరిగిన ఘర్షణ అనంతరం డ్రాగన్ను ఎదుర్కొనేందుకు ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చైనా వ్యూహాత్మక ఎత్తుగడలు, భవిష్యత్తులో ఆ దేశం నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత నిర్ణయం దోహదం చేస్తుందని సెంటర్ ఫర్ పాలసీ రీసర్చ్ సీనియర్ సభ్యుడు, యేల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సుశాంత్సింగ్ అన్నట్లు బ్లూమ్బర్గ్ కథనం పేర్కొంది.
ప్రస్తుతం భారత్తో సరిహద్దుల వెంట చైనా సైన్యం ఎంతమంది ఉన్నారన్నదానిపై స్పష్టత లేదు. అయితే సరిహద్దుల వెంట మోహరించిన దళాలు, కార్యకలాపాల్ని చైనా పెంచినట్లు భారత్ గుర్తించింది. కొత్త రన్వేలు, ఎయిర్ ఫీల్డులు, బంకర్ల నిర్మాణం సహా ట్యాంకులు, ఫైటర్ జెట్లను చైనా మోహరిస్తోంది. కొన్ని నెలలుగా దీర్ఘశ్రేణి ఫిరంగి, ట్యాంకులు, రాకెట్ రెజిమెంట్లు, ట్విన్ ఇంజిన్ ఫైటర్లను చైనా మోహరించినట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది. ఇరు దేశాలు ఇదే తీరులో ఎక్కువ సంఖ్యలో బలగాలను మోహరించడం ప్రమాదమని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..