ఆక్సిజన్ కొరత: జర్మనీ నుంచి ప్లాంట్ల దిగుమతి!
ఆక్సిజన్ ప్లాంట్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందులోభాగంగా జర్మనీ నుంచి దాదాపు 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను తీసుకురానున్నారు.
వారంలోనే అందుబాటులోకి తేనున్న రక్షణశాఖ
దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్లో విలయతాండవం చేస్తోన్న వేళ.. పలు రాష్ట్రాలు ఆక్సిజన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు దేశవ్యాప్తంగా పలు ప్లాంట్ల నుంచి ‘ఎక్స్ప్రెస్’ వేగంతో ఆక్సిజన్ కంటెయినర్లను తరలిస్తున్నారు. అయినప్పటికీ ఆక్సిజన్ కొరత తీరడం లేదు. దీంతో అప్రమత్తమైన భారత్, ఆక్సిజన్ ప్లాంట్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా జర్మనీ నుంచి దాదాపు 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను తీసుకురానున్నారు.
జర్మనీ నుంచి మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లను తీసుకువచ్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖకు అప్పగించింది. తొలుత రక్షణశాఖ ఆధ్వర్యంలోని కొవిడ్ కేంద్రాల్లో(ఏఎఫ్ఎంఎస్) ఈ మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువస్తామని రక్షణశాఖ వెల్లడించింది. అనంతరం ఇతర ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొంది. కేవలం వారం రోజుల్లోనే ఈ మొబైల్ ప్లాంట్లను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య అవసరమైన ఆక్సిజన్ కంటెయినర్లను యుద్ధవిమానాల ద్వారా భారత వాయుసేన చేరవేస్తోంది.
ఇక దేశంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో రక్షణ శాఖ తరపున పౌరులకు వీలైన సదుపాయాలు అందించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే ఉన్నతాధికారులకు సూచించారు. రెండు రోజుల క్రితం ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే, రక్షణశాఖ కార్యదర్శి, డీఆర్డీవో చీఫ్లతో సమీక్ష నిర్వహించిన కేంద్ర రక్షణమంత్రి, వారికి పలు సూచనలు చేశారు. ఇప్పటికే పలు కంటోన్మెంట్ ఆసుపత్రులను కొవిడ్ రోగులకు అందుబాటులోకి తీసుకురాగా.. రక్షణశాఖ తరపున వైద్య పరికరాలు, సిబ్బంది కొవిడ్ రోగుల సేవల్లో నిమగ్నమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..