Special Operations Group: ఉగ్రవేటకు ‘కార్గో’ రెడీ..!
జమ్ము కశ్మీర్లో పండట్లతో సహా ఇతర మైనార్టీలపై దాడులు పెరిగిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు నెలల నుంచి సుప్త చేతనావస్థలో ఉన్న స్పెషల్
* మళ్లీ సిద్ధమైన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్..!
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
జమ్ము కశ్మీర్లో పండితులతో సహా ఇతర మైనార్టీలపై దాడులు పెరిగిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు నెలల నుంచి సుప్తచేతనావస్థలో ఉన్న స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్వోజీ)ను మళ్లీ సిద్ధం చేసింది. జమ్ము కశ్మీర్ పోలీసుల్లో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో అనుభవం ఉన్నవారితో దీనిని ఏర్పాటు చేశారు. దీని నిక్నేమ్ ‘కార్గో’..!
ఈ ఏడాది మే వరకు కార్గో బాధ్యతలు చూసిన తాహిర్ అష్రఫ్ను వేరే విభాగానికి బదిలీ చేశారు. అనంతరం మరొకరికి కార్గో అదనపు బాధ్యతలను అప్పజెప్పారు. కానీ, తాజాగా జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడులు పెరగడంతో కార్గో పూర్తి స్థాయి బాధ్యతలను ఎస్పీ హోదాలో ఇఫ్తికార్ తాలిబ్కు అప్పజెప్పారు. ఆయనకు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో మంచి అనుభవం ఉంది. ఆయన గతంలో ఎస్వోజీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇప్పటి వరకు లద్దాఖ్ రీజియన్లో డిప్యూటేషన్పై పని చేశారు. జమ్ము కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీంతోపాటు క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ సేకరణలో కూడా చురుగ్గా వ్యవహరిస్తోంది. దీనిలో మొత్తం 1000 మంది సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారు.
ఈ పేరు ఎలా వచ్చింది..
ఒకప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ కార్గో విభాగంలో ఎస్వోజీ ప్రధాన కార్యలయ భవనం ఉంది. అందుకే దీనికి కార్గో అనే పేరు వచ్చింది. జమ్ము కశ్మీర్లోని ఐజీ ర్యాంక్ హోదా ఉన్న అధికారి దీని కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ఈ దళం మొత్తాన్ని చిన్న బృందాలుగా చేశారు. ఒక్కో బృందం ఒక్కో రకమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తుంది. కొన్ని బృందాలు ఫోన్ ట్రాకింగ్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ను సేకరిస్తుంటాయి. దీంతోపాటు సోషల్ మీడియాను పరిశీలించే బృందాలు ఉన్నాయి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ సేకరణ కూడా కార్గో చేస్తుంది.
సాధారణంగా చినార్ కోర్లో భాగమైన రాష్ట్రీయ రైఫిల్స్ అత్యధికంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు నేతృత్వం వహిస్తుంది. ఒక్క శ్రీనగర్ తప్ప మిగిలిన చోట్ల వీటి ఆపరేషన్లకు ఆవసరమైన ఇన్ఫర్మేషన్ కార్గో బృందాల నుంచే లభిస్తుంది. జమ్ము కశ్మీర్లోని ప్రతి జిల్లాలో కార్గో బృందాలు ఉన్నాయి. కశ్మీర్లోని జిల్లాలో కార్గో దళాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. భారీగా ఉగ్రదాడులు జరిగిన చోట్ల దాదాపు 10 దళాలు పని చేసిన సందర్భాలూ ఉన్నాయి. జిల్లాలో వీటికి డీఎస్పీ స్థాయి అధికారి నాయకత్వం వహిస్తున్నారు. కానీ, వీరందరికి ప్రధాన కార్యలయం మాత్రం శ్రీనగర్లోని కార్గో భవనమే.
ఈ ఎస్వోజీ ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లకు వినియోగించే వాహనం కూడా ప్రత్యేకమైందే. ఆపరేషన్ జరుగుతున్న ప్రదేశం 360 డిగ్రీల్లో కనిపించేలా ఏర్పాట్లు ఇందులో ఉంటాయి. దీంతోపాటు ఈ బృందం అపరేషన్కు వెళితే అదనపు దళాలను కూడా సిద్ధంగా ఉంచుతారు. ఎస్వోజీ గ్రూప్ కమాండోలపై ఆరోపణలు రాకుండా బాడీ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు అధికారులు అవసరమైన సమయంలో వైర్లెస్ సెట్లలో సూచనలు చేస్తారు.
ఉగ్రవాదంలోకి వెళ్లిన యువతను గుర్తించే పనిని కూడా ఈ ఎస్వోజీ గ్రూప్ చేస్తుంది. హఠాత్తుగా ఎవరైనా యువకుడు అదృశ్యమైన సమాచారం అందిన వెంటనే అతడి గత చరిత్ర, పరిచయాలు వంటి కీలక సమాచారాన్ని తవ్వితీస్తుంది. దీనిని బట్టి అతడు ఏ ఉగ్రబృందంలోని రిక్రూటర్ల ప్రభావానికి లోనైంది గుర్తిస్తోంది. ఈ రకంగా చాలా మందిని మళ్లీ వెనక్కి తీసుకొచ్చినట్లు మే వరకు కార్గో ఎస్పీగా పనిచేసిన అష్రఫ్ పేర్కొన్నారు. ఉగ్ర నియామకాలు చేసే వారు వినియోగించే సోషల్ మీడియా కార్యకలాపాలను ఈ గ్రూప్ నిశితంగా పరిశీలిస్తుంటుంది. ఎవరైన యువత ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉచ్చులో పడినట్లు గుర్తిస్తే వెంటనే వారి తల్లిడంద్రులకు సమాచారం అందజేస్తుంది. కొన్ని సందర్భాల్లో వీరి ప్రయత్నాలు విఫలమవుతుంటాయి కూడా. అలాంటి సమయాల్లో మాత్రమే ఎన్కౌంటర్లు జరుగుతుంటాయని కార్గో బృందం చెబుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!