Karnataka: హిజాబ్‌ వివాదం.. పరీక్ష రాయకుండానే వెనుదిరిగిన విద్యార్థినులు...

కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పీయూ రెండో సంవత్సర పరీక్షలు ప్రారంభమైయాయి. హిజాబ్‌ ధరించి పరీక్షకు హాజరైన విద్యార్థినులను కాలేజీ యాజమాన్యం పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు.

Published : 23 Apr 2022 01:33 IST

ఉడుపి: కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పీయూసీ రెండో సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి.  హిజాబ్‌ ధరించి పరీక్షకు హాజరైన ఇద్దరు విద్యార్థినులను కాలేజీ యాజమాన్యం పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. ఆ విద్యార్థినులు దాదాపు 45 నిమిషాల పాటు ఇన్విజిలేటర్‌, కళాశాల ప్రిన్సిపల్‌ను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ .. హిజాబ్‌ ధరించి పరీక్షలకు హాజరవ్వకూడదని కోర్డు ఆదేశాలు ఉన్నందున.. ఆ విద్యార్థినులను అనుమతించలేమని స్పష్టం చేశారు. దీంతో పరీక్ష రాయకుండానే వారు వెనుదిరిగారు. కాగా, తనను హిజాబ్‌ ధరించి పరీక్ష రాయడానికి అనుమతించాలని ఓ విద్యార్థి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నగేశ్‌ను అభ్యర్థించగా.. అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఏడాది జనవరిలో ఉడుపి కళాశాలలో మొదలైన హిజాబ్‌ వివాదం సమీపంలోని మరికొన్ని కళాశాలలకు వ్యాపించింది. ఈ విషయంలో విద్యార్థినులు దాఖలు చేసిన అన్ని పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. విద్యాసంస్థల్లో ఏకరీతి దుస్తుల నియమాన్ని పాటించాలని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని