Kim Jong Un: కిమ్కు భయం పట్టుకుందా?
ఇప్పటి వరకు తమ దేశంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని చెప్పుకుంటూ వచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కి భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. మహమ్మారి కట్టడి నిబంధనల....
ఆయన నోటి వెంట వచ్చిన ఆ సంక్షోభం ఏంటి?
ప్యాంగ్యాంగ్: ఇప్పటి వరకు తమ దేశంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని చెప్పుకుంటూ వచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కి భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. మహమ్మారి కట్టడి నిబంధనల అమలులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేసినట్లు అధికారిక మీడియా కేసీఎన్ఏ పేర్కొంది. అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కిమ్.. వారిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపింది.
సంక్షోభం ఏంటి?
అధికారుల నిర్లక్ష్యం దేశ, ప్రజల భద్రత విషయంలో పెను సంక్షోభానికి దారితీస్తోందని కిమ్ వ్యాఖ్యానించినట్లు కేసీఎన్ఏ వెల్లడించింది. దేశంలో చేపట్టిన విప్లవాత్మక అభివృద్ధి పనులకు అధికారుల నిర్లక్ష్యం అడ్డంకిగా మారిందని ఆయన అన్నట్లు పేర్కొంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది..? కరోనా కేసులు నమోదవుతున్నాయా? కిమ్ పేర్కొంటున్న సంక్షోభం ఏంటి? అన్ని దానిపై మాత్రం కేసీఎన్ఏ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
కునారిల్లుతున్న ఆరోగ్య వ్యవస్థలు..
తమ దేశంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఇటీవల కిమ్ డబ్ల్యూహెచ్ఓకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. అయితే, దీనిపై అమెరికా, జపాన్ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మహమ్మారి కట్టడి నిమిత్తం ఉత్తర కొరియా కఠిన ఆంక్షలు విధించింది. బయటి దేశాలతో పెద్దగా సంబంధాలు లేని ఆ దేశం.. ఉన్న అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనాతోనూ సరిహద్దులు మూసేసింది. దీంతో అక్కడ భారీ ఆహార, ఆర్థిక సంక్షోభం నెలకొంది. మరోవైపు సంప్రదాయ వైద్య వసతులతో కునారిల్లుతున్న ఆ దేశ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలు మహమ్మారి చికిత్సను ఏమాత్రం భరించలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కిమ్ ఆది నుంచి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
కుంగుతున్న ఆర్థికానికి కరోనా పెను ప్రమాదం..
కిమ్ పేర్కొన్న సంక్షోభం ఎలాంటిది అన్న దానిపై ఓ నిర్ధారణకు రావడం తొందరపాటు అవుతుందని ఆ దేశ వ్యవహారాలపై పట్టున్న దక్షిణ కొరియా నిపుణుడు చియోంగ్-సియోంగ్-చాంగ్ అన్నారు. అయితే, టెస్టింగ్ కిట్ల లేమి, వైద్య వసతుల దయనీయ స్థితి వల్ల తొలి నుంచి ఉత్తర కొరియా అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మహమ్మారి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని కిమ్ సర్కార్ భావిస్తున్నట్లుందని పేర్కొన్నారు.
టీకాల స్వీకరణకూ అనుమానాలు..
మరోవైపు డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీలో సమానత్వం కోసం ఏర్పాటైన కొవాక్స్ కూటమి ద్వారా ఉత్తర కొరియాకు ఇప్పటి వరకు ఒక్క డోసు కూడా చేరలేదు. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ వ్యాక్సిన్ల పంపిణీ వ్యవస్థ గవీ జూన్లో ప్రకటించింది. కొవాక్స్ కూటమి నిబంధనల ప్రకారం ఉత్తర కొరియాకు మే నాటికి 1.7 మిలియన్ డోసులు అందాల్సి ఉందని జపాన్ ప్రముఖ వార్తా సంస్థ క్యోడో న్యూస్ ఇటీవల పేర్కొంది. కానీ, కొవాక్స్ మార్గదర్శకాలు, నిబంధనలను అమలు చేసేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా లేకపోవడంతో టీకాలు వారికి చేరలేదని తెలిపింది. వ్యాక్సిన్లను తీసుకొచ్చే విదేశీయుల వల్ల కూడా దేశంలోకి వైరస్ ప్రవేశించే అవకాశం ఉందని కిమ్ యంత్రాంగం భావిస్తున్నట్లు సమాచారం. పైగా వ్యాక్సిన్ సామర్థ్యం, భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇటీవల అక్కడి ఓ ప్రధాన వార్తా పత్రిక రోడోంగ్ సిన్మున్ కథనం ప్రచురించింది.
అందుకే సన్నబడ్డారా?
ఇక ఇటీవల కిమ్ బాగా సన్నబడ్డట్లు కేసీఎన్ఏలో ప్రచురితమైన ఓ కథనం ధ్రువీకరించింది. ఆయన సన్నబడడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా తెలిపింది. అయితే, ఆయన ఆరోగ్యంపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. అనారోగ్యం వల్లే ఆయన సన్నబడి ఉంటారని కొంతమంది వాదిస్తుంటే.. కరోనా సోకి ఉంటుందని మరికొంత మంది అనుమానిస్తున్నారు. మరోవైపు దేశం తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజల్లో అసంతృప్తి నెలకొనకుండా.. వారి సానుభూతి కోసమే ఇలాంటి జిత్తులకు తెరతీస్తున్నారన్న వాదన కూడా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు