కాబోయే భార్యకు చంద్రుడిపై భూమి

ప్రేమికుల రోజు సందర్భంగా తనకు కాబోయే భార్య కోసం ఏకంగా చంద్రుడిపై భూమి కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు ఇండోర్‌కు చెందిన పలాష్‌ నాయక్‌. అం

Published : 15 Feb 2021 07:41 IST

ఇండోర్‌: ప్రేమికుల రోజు సందర్భంగా తనకు కాబోయే భార్య కోసం ఏకంగా చంద్రుడిపై భూమి కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు ఇండోర్‌కు చెందిన పలాష్‌ నాయక్‌. అంతేకాదు ఒక నక్షత్రానికి ఆమె పేరు కూడా పెట్టారు. పలాష్‌ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. అక్కడ ఫ్రీ లాంచింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అతని కాబోయే భార్య హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. తన ప్రియమైన వారికి భిన్నంగా ఏదైనా చేయాలనే అభిరుచిలో భాగంగానే చంద్రునిపై భూమి కొనేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పలాష్‌ పేర్కొన్నారు. చంద్రునిపై ఒక ఎకరం భూమిని కలిగి ఉన్నట్లు ధ్రువపత్రాన్ని కూడా పొందాడు. అంతకుముందు భారతదేశంలో కొంత మందికి మాత్రమే చంద్రుడి మీద భూమిని సొంతం చేసుకున్న అనుభవం ఉంది. వీరిలో బాలీవుడ్‌ నటులు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, షారూక్‌ ఖాన్‌ ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని