ఇలాగే ఉంటే లాక్డౌన్ని తోసిపుచ్చలేం
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఇలాగే కొనసాగితే లాక్డౌన్ విధించడాన్ని తోసిపుచ్చలేమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో కొత్త ......
కరోనా విజృంభణపై మహారాష్ట్ర సీఎం ప్రకటన
ముంబయి: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఇలాగే కొనసాగితే లాక్డౌన్ విధించడాన్ని తోసిపుచ్చలేమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్న వేళ శుక్రవారం రాత్రి ఆయన ఈ ప్రకటన చేశారు. త్వరలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించనున్నట్టు తెలిపారు. కొవిడ్ గొలుసును ఛేదించడంపై పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నట్టు చెప్పారు. తానూ లాక్డౌన్ కోరుకోవడంలేదని, కానీ పరిష్కారమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 65 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామన్నారు. నిన్న ఒక్కరోజే 3 లక్షల మందికి టీకా వేసినట్టు తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించకపోవడంతో కొందరు ఈ వైరస్ బారిన పడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో రోజుకు 2.5 లక్షల కొవిడ్ పరీక్షలు చేయడమే లక్ష్యంగా ఉందన్నారు. కరోనాతో పరిస్థితులు క్షీణిస్తే వైద్య సదుపాయాల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరించానని తెలిపారు. వైరస్ తీవ్రతను బట్టి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు, మహారాష్ట్రలో ఇప్పటికే కొవిడ్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు పలు జిల్లాలు/నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ వంటి ప్రత్యేక ఆంక్షలు అమలుచేస్తున్న విషయం తెలిసిందే.
మహారాష్ట్రలో ఒక్కరోజులో 47వేల కొత్త కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్ పగ్గాల్లేకుండా విస్తరిస్తోంది. నిన్న 43 వేల కేసులు నమోదైతే.. శుక్రవారం 47వేలకు పైగా కొత్త కేసులు రావడం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 47,827 కొత్త కేసులు, 202 మరణాలు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో ఒక్క ముంబయి మహా నగరంలోనే 8,648 కేసులు, 20 మరణాలు వెలుగుచూశాయి. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటివరకు 2,01,58,719 శాంపిల్స్ పరీక్షించగా.. 29,04,079 మందికి పాజిటివ్గా తేలింది. వీరిలో 24,57,494 మంది కోలుకోగా.. 55,379 మంది మరణించారు. ప్రస్తుతం 3,89,832 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.