Delhi: పండగవేళ భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. దిల్లీలో పాక్‌ ఉగ్రవాది అరెస్టు

పండగ సీజన్‌లో భారీ ఉగ్రదాడికి పాల్పడేందుకు ముష్కరులు చేసిన కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతడి

Updated : 12 Oct 2021 17:01 IST

దిల్లీ: పండగ సీజన్‌లో భారీ ఉగ్ర కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతడి నుంచి ఓ ఏకే-47 తుపాకీ, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

పండగల వేళ దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. గత కొన్ని రోజులుగా దిల్లీ వ్యాప్తంగా ముమ్మర గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగానే నిన్న రాత్రి లక్ష్మీనగర్‌ ప్రాంతంలో ఓ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిని పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్‌ అష్రఫ్‌గా గుర్తించారు. పాక్‌ దేశస్థుడైన అష్రఫ్‌ నకిలీ పత్రాలతో భారత్‌లో గుర్తింపు కార్డులు సాధించి అక్రమంగా నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. స్లీపర్‌ సెల్‌లో కీలకమైన వ్యక్తిగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

ఉగ్రవాది నుంచి ఒక ఏకే-47 తుపాకీ, 60 రౌండ్ల బుల్లెట్లు, ఒక హ్యాండ్‌ గ్రనేడ్‌, రెండు పిస్టోళ్లు, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దిల్లీ పోలీసు కమిషనర్‌ రాకేశ్ అస్తానా స్పందిస్తూ.. ‘‘పండగల వేళ భారీ ఉగ్ర కుట్రను మా బృందం భగ్నం చేసింది’’ అని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని