Jammu Kashmir: సీఆర్పీఎఫ్ అధికారి రైఫిల్ను ఎత్తుకుపోయిన ఉగ్రవాది..భద్రతా బలగాల గాలింపు
ఓ సీఆర్పీఎఫ్ అధికారి రైఫిల్ను ఉగ్రవాది ఎత్తుకుపోయాడు.ఈ ఘటన జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగింది. ఉగ్రవాది కోసం భద్రతాబలగాలు గాలిస్తున్నాయి.
పుల్వామా: జమ్ముకశ్మీర్లోని పుల్వామా సెక్టార్లో ఓ ఉగ్రవాది, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి రైఫిల్ను గుంజుకొని పారిపోయాడు. పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ 183వ బెటాలియన్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడిని ఇర్ఫాన్ గనీగా గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు ఆ మొత్తం ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్తోపాటు అదనపు బలగాలను రప్పించి ఉగ్రవాది కోసం గాలింపు చేపడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. కూంబింగ్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అన్ని మార్గాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అతడికి ఆశ్రయం కల్పిస్తారని అనుమానమున్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నారు.
ఇర్ఫాన్ గనీ తండ్రి షఫీకి చెందిన ఆస్తులను శనివారం జమ్ముకశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవంతిపురా ప్రాంతంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంతో పాటు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు అతడిపై ఉన్నాయి. మరోవైపు శనివారం సాయంత్రం జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బగ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. 2022వ సంవత్సరంలో 186 ఉగ్రవాదులతోపాటు, పాకిస్థాన్కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయీబాకు చెందిన మరో 56 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు వార్షిక నివేదికలో వెల్లడించారు. జమ్ముకశ్మీర్ రీజియన్లో ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారన్నదానిపై ఆయన మాట్లాడుతూ..విదేశీ ఉగ్రవాదులతో కలిపి దాదాపు 100 మంది యాక్టివ్గా ఉన్నట్లు చెప్పారు. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. డీజీపీ వార్షిక నివేదికను వెల్లడించిన తర్వాతి రోజునే ఓ సీఆర్పీఎఫ్ అధికారి రైఫిల్ను ఉగ్రవాది ఎత్తుకుపోవడం చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?