సచిన్ వాజే తీరు అంతా అనుమానాస్పదం..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి బెదిరింపుల కేసులో అరెస్టైన సచిన్ వాజే తీరు అత్యంత అనుమానాస్పందగా మారింది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
నివాస ప్రాంగణ కెమేరా డీవీఆర్ మాయం
ఇంటర్నెట్డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి బెదిరింపుల కేసులో అరెస్టయిన సచిన్ వాజే తీరు అత్యంత అనుమానాస్పదంగా మారింది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు సచిన్ వాజే నివసించే గృహ సముదాయం సీసీ కెమేరా ఫుటేజీ, ఆ రికార్డులు ఉండే డీవీఆర్పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దృష్టిసారించింది. అంబానీకి బెదిరింపులు వచ్చిన రెండురోజుల్లోనే ఈ కేసు దర్యాప్తు కోసమంటూ సచిన్ నివాసం ఉన్న గృహసముదాయం సీసీకెమేరా ఫుటేజీలు ఉన్న డీవీఆర్ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వారు కూడా సచిన్ వాజే బృందంలోని సభ్యులు కావడం జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానాలను పెంచేసింది.
మన్సుఖ్ హిరేన్ కుటుంబసభ్యులు సచిన్ వాజేపై ఆరోపణలు చేయడంతో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. మన్సుక్ను గుర్తించిన చివరి లొకేషన్ వంటి వివరాలు ముంబయి క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ వాజేపై అనుమానాలు పుట్టించేవిగా ఉన్నాయి. ఈ కేసును చేపట్టిన ఎన్ఐఏకు ఓ లేఖ దొరికింది. ఫిబ్రవరి 25న అంబానీ ఇంటిదగ్గర పేలుడు పదార్థాల వాహనం వెలుగులోకి వచ్చిన తర్వాత రెండు రోజులకే ఈ లేఖను రాసినట్లు తేలింది. ఇది సచిన్ వాజే నివసించే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ సెక్యూరిటీ విభాగానికి క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ ( వాజే నేతృత్వం వహిస్తున్న విభాగమే) పోలీస్ అధికారి రియాజ్ ఖ్వాజీ ఓ చిత్తుకాగితంపై ఈ లేఖను రాశారు. అప్పుడు మొత్తం నలుగురు అధికారులు అక్కడకు వెళ్లారు. అంబానీకి బెదిరింపుల కేసును దర్యాప్తు చేస్తున్నాం.. అందుకని ఈ గృహ సముదాయంలో ఉన్న రెండు డిజిటల్ వీడియో రికార్డ్లర్లను అప్పగించాలని వారు ఆ లేఖలో కోరారు. ఈ లేఖను సెక్యూరిటీ సిబ్బంది, గృహసముదాయ సంఘ ఛైర్మన్కు ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి రెండు డీవీఆర్లు తీసుకొని వెళ్లిపోయారు.
ఈ లేఖ దొరికాక ఎన్ఐఏకు మరికొన్ని కొత్త అనుమానాలు వచ్చాయి. అపహరణకు గురైన మన్సుక్ ఎస్యూవీని ఫిబ్రవరి 25వరకు ఆ రెసిడెన్షియల్ కాంపౌండ్లోనే ఉంచినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ రియాజ్ ఖ్వాజీని ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది.
ఎన్ఐఏ సచిన్ను గతవారం అదుపులోకి తీసుకొని కొన్ని గంటలపాటు ప్రశ్నించింది. ఆ తర్వాత అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి 14వ తేదీన కోర్టు ముందు ప్రవేశపెట్టింది. న్యాయస్థానం ఈ నెల 25 తేదీ వరకు ఎన్ఐఏ కస్టడీ విధించింది. ఇక స్కార్పియో యజమాని శామ్ న్యూటన్ను కూడా ప్రశ్నించనుంది. వాస్తవానికి స్కార్పియో అసలు యజమాని శామ్ న్యూటన్. మన్సుక్ వద్ద దాదాపు లక్షల విలువైన కారు ఇంటీరియర్ పనిచేయించుకొని అతను డబ్బు ఇవ్వలేదు. దీంతో ఆ పాత కారును మన్సుఖ్కు వదిలేశాడు. తర్వాత మన్సుఖ్ నుంచి సచిన్ చేతికి వెళ్లింది. నిందితులు పేలుడు పదార్థాలున్న కారును అంబానీ ఇంటి సమీపంలో వదిలేసిన తర్వాత వాడిన ఇన్నోవా వాహనం క్రైమ్ ఇంటెలిజెన్స్ సెల్దిగా అనుమానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?