Bihar: తేజస్వి బిహార్ ముఖ్యమంత్రట.. నోరు జారిన సీఎం నితీశ్..!
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ టంగ్ స్లిప్ అయ్యారు. తన డిప్యూటీ తేజస్వీ యాదవ్ గురించి ప్రస్తావిస్తూ.. పొరపడ్డారు.
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ టంగ్ స్లిప్ అయ్యారు. తన డిప్యూటీ తేజస్వీ యాదవ్ గురించి ప్రస్తావిస్తూ.. పొరపడ్డారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తేజస్విని ముఖ్యమంత్రి అనేశారు. అంతేగాకుండా తన తప్పిదాన్ని సరిదిద్దుకునే ప్రయత్నమూ చేయకపోవడం గమనార్హం.
మంగళవారం ఓ కార్యక్రమంలో నితీశ్ మాట్లాడుతూ.. ‘గౌరవనీయ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్’ అనేశారు. ఆ తర్వాత తన పొరపాటును సరిచేసుకోకుండానే ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ విషయం వెలుగులోకి రాగానే, భాజపా తన విమర్శలకు పదునుపెట్టింది. ‘స్పృహలో ఉండో, అనాలోచితంగానో తేజస్విని నితీశ్ ముఖ్యమంత్రిగా అంగీకరించినట్లు కనిపిస్తోంది. నితీశ్ ఆశ్రమానికి వెళ్లడానికి సరైన సమయం వచ్చింది’ అని భాజపా ప్రతినిధి నిఖిల్ ఆనంద్ ఎద్దేవా చేశారు. నితీశ్ను ఉద్దేశిస్తూ.. ఇటీవల ఆర్జేడీ నేత ఈ ‘ఆశ్రమం’ అనే పదాన్ని వాడారు. 70 ఏళ్ల వయస్సు అంటే ఆశ్రమానికి వెళ్లే సమయమని ఆ నేత వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. ‘ప్రసంగాల్లో పొరపాటున నోరు జారిన వాటికి ప్రాధాన్యం ఉండదు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ కూడా తన ప్రసంగంలో నెహ్రూను ప్రధాని అని సంబోధించారు. ఆర్జేడీతో జేడీయూ బంధం విషయంలో భాజపాను అసూయపడనివ్వండి’ అంటూ జేడీయూ కౌంటర్ ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.