Pak boat found: భారత జలాల్లోకి ప్రవేశించిన 10మంది పాక్ జాతీయుల అరెస్టు
సముద్ర మార్గం ద్వారా భారత్లోకి వచ్చేందుకు పాక్ వాసులు ప్రయత్నిస్తుండగా, వారి చర్యలను ఎప్పటికప్పుడు భారత దళాలు..
సముద్రమార్గం ద్వారా భారత్లోకి వచ్చేందుకు పాక్ వాసుల యత్నం
అహ్మదాబాద్: భారత్లోకి చొరబాట్ల రూపంలో పాక్ చేస్తున్న కుయుక్తులను ఎప్పటికప్పుడు భారత దళాలు తిప్పికొడుతున్నాయి. భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన 10 మంది సిబ్బందితో కూడిన పాకిస్థాన్ బోట్ను స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) రక్షణ ప్రతినిధి ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి ఐసీజీ షిప్ ‘అంకిత్’ అరేబియా సముద్రంలో ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఆపరేషన్లో భాగంగా ‘యాసిన్’ అనే పేరు గల పాకిస్థాన్ బోట్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బోట్లోని 10 మందిని గుజరాత్ తీరరక్షక దళం అదుపులోకి తీసుకున్నట్లు, విచారణ నిమిత్తం పోర్ బందర్కు తరలించినట్లు గుజరాత్ డిఫెన్స్ అధికారులు ట్విటర్లో పేర్కొన్నారు. 2021 సెప్టెంబర్ 15న కూడా ఐసీజీ నిర్వహించిన ఆపరేషన్లో భారత జలాల్లోకి ప్రవేశించిన 12 మంది సిబ్బందితో కూడిన పాకిస్థాన్ బోట్ను అదుపులోకి తీసుకున్నారు. బోట్ల ద్వారా గుజరాత్ తీరం నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటుండగా అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. గడిచిన డిసెంబర్ 20న గుజరాత్ తీరంలో ఇండియన్ కోస్ట్ గార్డ్, ఉగ్రవాద నిరోధక తనిఖీ బృందం నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో భాగంగా ఆరుగురు సిబ్బందితో కూడిన పాకిస్తానీ ఫిషింగ్ బోట్లో సుమారు రూ.400కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ను తీసుకెళ్తుండగా భారత జలాల్లో పట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.