African Swine Fever: కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం.. 685 పందుల హతం
కేరళ వయనాడ్ జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్ల్యూ కలకలం రేపుతోంది. ఈ వైరస్తో రెండు ఫామ్లలోని 44 పందులు మృతిచెందాయి.......
తిరువనంతపురం: కేరళ వయనాడ్ జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్ల్యూ కలకలం రేపుతోంది. ఈ వైరస్తో రెండు ఫామ్లలోని 44 పందులు మృతిచెందాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు కట్టడి చర్యలు చేపట్టారు. పశుసంవర్ధక శాఖ ఆదేశాల మేరకు జులై 25వ తేదీ నాటికి వయనాడ్లోని మనంతవాడీ మున్సిపాలిటీ సహా తవింజల్ గ్రామంలోని ఐదు ఫామ్లలోని 685 పందులను హతమార్చారు.
పశుసంవర్ధక శాఖలోని డిసీజ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డాక్టర్ మినీ జోస్ వివరాల ప్రకారం.. కిలోమీటరు పరిధిలో విస్తరించి ఉన్న పందుల ఫామ్లలో కల్లింగ్ బృందం పనిని నిర్వహించి, ఆ ప్రాంతంలో క్రిమిసంహారక చర్యలు చేపట్టింది. ‘ఈ ఆపరేషన్లో భాగంగా రెండు నిపుణుల బృందాలు పనిచేస్తున్నాయి. చంపిన పందులను లోతైన గుంటలలో పాతిపెట్టారు’ అని జోస్ తెలిపారు. వీటి యజమానులకు ప్రభుత్వం పరిహారం అందిస్తోంది.
కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వెలుగుచూడటం ఇదే మొదటిసారి. దీంతో అధికారులు పందుల ఫామ్లపై దృష్టిసారించారు. వయనాడ్లో నమోదైన 244 ఫామ్లలో ప్రస్తుతం 4,740 పందులు, 6,454 పంది పిల్లలను మాంసం కోసం పెంచుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని, ఈ ఫ్లూ ఇతర జంతువులకు గానీ, మనుషులకు గానీ విస్తరించే అవకాశం లేదని పశుసంవర్ధకశాఖ అధికారి డా.రాజేశ్ పేర్కొన్నారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అత్యంత వ్యాప్తి కలిగిన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ సోకితే ఆ పందులను చంపడం, ఆ ప్రాంతంలో కట్టడి చర్యలు తీసుకోవడం మినహా మరో మార్గం లేదని ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.