Indigo: పోయిన లగేజీ కోసం.. ఇండిగో వెబ్సైట్ను హ్యాక్ చేశాడు..!
విమాన ప్రయాణాల్లో లగేజీలు మర్చిపోవడం, మారిపోవడం అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అయితే వాటి కోసం ప్రయాణికులు పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఎన్నో ప్రయాసలు
ఎయిర్లైన్ స్పందన ఏంటంటే..?
ఇంటర్నెట్డెస్క్: విమాన ప్రయాణాల్లో లగేజీలు మర్చిపోవడం, మారిపోవడం అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అయితే, వాటి కోసం ప్రయాణికులు పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఎన్నో ప్రయాసలు పడి, ఫిర్యాదులు చేస్తే గానీ ఆ వస్తువులు తిరిగి రావు. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రయాణంలో లగేజీ మారిపోయింది. దీనికోసం సదరు విమానయాన సంస్థకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆ వ్యక్తి ఏకంగా ఎయిర్లైన్స్ వెబ్సైట్ను హ్యాక్ చేశాడు..! అసలేం జరిగిందంటే..
నందన్కుమార్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. గత ఆదివారం నందన్ పట్నా నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో ప్రయాణించారు. అయితే, ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అతడి లగేజీ వేరే ప్రయాణికుడి లగేజీతో మారిపోయింది. రెండు బ్యాగులు అచ్చం ఒకేలా ఉండటంతో ఈ పొరబాటు జరిగింది. ఇంటికెళ్లాక ఈ విషయాన్ని గుర్తించిన నందన్.. ఇండిగో కస్టమర్ కేర్కు ఫోన్ చేశారు. అయితే ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు చెప్పడం కుదరదన్న కస్టమర్ కేర్ ప్రతినిధులు.. ఆ వ్యక్తిని సంప్రదించి సమాచారమిస్తామని మాత్రమే చెప్పారు.
ఒక రోజు గడిచినా ఇండిగో కస్టమర్ కేర్ నుంచి ఎలాంటి కాల్ రాలేదు. దీంతో సమస్యను తానే పరిష్కరించుకోవాలని నందన్ నిశ్చయించుకొన్నాడు. ఇండిగో వెబ్సైట్కు వెళ్లి తనతో పాటు ప్రయాణించి వారి వివరాలేమైనా దొరుకుతాయేమో అని వెతికారు. అయితే, ఎంత ప్రయత్నించినా ఎలాంటి సమాచారం లభించలేదు. ఇక చేసేదేం లేక, తన డెవలపర్ నైపుణ్యాలకు పనిపెట్టారు. ఇండిగో వెబ్సైట్ను హ్యాక్ చేసి తన లగేజీ తీసుకెళ్లిన ప్రయాణికుడి వివరాలను సంపాదించారు. అదృష్టవశాత్తూ ఆ ప్రయాణికుడు.. నందన్ ఇంటికి దగ్గర్లోనే ఉండటంతో ఇద్దరు కలుసుకొని లగేజీలు మార్చుకున్నారు.
ఈ విషయాన్నంతటినీ ట్విటర్లో రాసుకొచ్చిన నందన్.. చివరగా ఇండిగో ఎయిర్లైన్కు కొన్ని సూచనలు కూడా చేశారు. ‘మీ వెబ్సైట్ నుంచి సున్నితమైన వివరాలు లీక్ అయ్యే అవకాశాలున్నాయి. వాటిని సరిచేసుకోండి’’ అని సలహా ఇచ్చారు. నందన్ ట్వీట్లు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ఇండిగో ఏమందంటే..
దీనిపై ఇండిగో ఎయిర్లైన్ కూడా స్పందించింది. ‘‘కస్టమర్ల డేటా గోప్యత, సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలకు ఇండిగో ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. బ్యాగేజీ వ్యవహారాల కోసం మా వెబ్సైట్లోని ఐవీఆర్లో ప్రత్యేకంగా ఓ ఆప్షన్ను అందుబాటులో ఉంచాం. ఒక్కో ఆప్షన్ను కస్టమర్ కేర్ సెంటర్లోని ఒక్కో బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. అయితే, మీరు ఆ ఆప్షన్ను వినియోగించుకోకుండా వేరే ఆప్షన్లను ఎంచుకున్నారు. అందుకే మీ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు మా కస్టమర్ కేర్ బృందానికి సమయం పట్టింది. గోప్యత విధానాల ప్రకారం.. మా కస్టమర్ల వివరాలను ఇతరులతో పంచుకోవడం కుదరదు. మీ బ్యాగేజీ తీసుకెళ్లిన వ్యక్తితో కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేసేందుకు మా కస్టమర్ కేర్ టీం ప్రయత్నించింది. మా ఐటీ ప్రక్రియ పూర్తిగా దృఢంగా ఉంది. డేటా లీక్ విషయంలో ఇండిగో ఎప్పుడూ రాజీ పడదు. అయితే మీ ఫీడ్బ్యాక్ను మేం తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం’’ అని ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది.
కొసమెరుపు..
నందన్ తన లగేజిని మార్చుకోవడానికి సహ ప్రయాణికుడిని కలిసిన సమయంలో ఇండిగో నుంచి కాల్స్ ఏమైనా వచ్చాయా? అని ప్రశ్నించాడు. దానికి ఆ ప్రయాణికుడు స్పందిస్తూ.. ఎటువంటి కాల్స్ రాలేదని చెప్పాడు. వాస్తవానికి కస్టమర్ కేర్ ఏజెంట్ మాత్రం ఆ ప్రయాణికుడికి తాము మూడు సార్లు కాల్ చేసినట్లు నందన్కు వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.