Gandhi Jayanti: గాంధీ జీవితం, ఆదర్శాలు ప్రతి తరానికి స్ఫూర్తినిస్తాయి..
జాతిపితా మహాత్మాగాంధీ జీవనం ప్రజలకు ఆదర్శమని ప్రముఖులు కొనియాడారు. బాపు 152వ జయంతి పురస్కరించుకుని శనివారం వారు ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీ పాత్ర ఎనలేనిదని కీర్తించారు. ఈ సందర్భంగా ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రీకీ జయంతి నివాళులర్పించారు...
మహాత్ముడికి ఘన నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
దిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ జీవనం ప్రజలకు ఆదర్శమని ప్రముఖులు కొనియాడారు. బాపు 152వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీ పాత్ర ఎనలేనిదని కీర్తించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రీకీ నివాళులర్పించారు.
> బాపు పోరాటం, త్యాగాలను స్మరించుకోవాల్సిన ప్రత్యేక రోజు ఇది. గాంధీ బోధనలు, ఆదర్శాలు, జీవిత విలువలను పాటిస్తూ.. మహాత్ముడు కలలు కన్న దేశాన్ని రూపొందించడానికి మనమంతా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. - రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
> సత్యం, అహింసలే ఆయుధాలుగా గాంధీ భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికారు. బాపు మార్గాన్ని అనుసరిస్తూ, నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను. - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
> పూజ్య బాపు జీవితం, ఆయన ఆదర్శాలు.. దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. గాంధీ ఆచరించిన సూత్రాలు సమకాలీన ప్రపంచానికి అవసరం. గాంధీ సూత్రాలు లక్షలాది మందికి బలాన్ని చేకూరుస్తాయి.- ప్రధాని నరేంద్ర మోదీ
> విజయం సాధించేందుకు ఒక్క సత్యాగ్రహీ చాలు. మహాత్మా గాంధీకి వినయపూర్వక నివాళులు. - కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
> గాంధీ జీవితం నిరంతర త్యాగాల బాట. ప్రపంచాన్ని శాంతి, అహింస మార్గంలో నడిపించేలా ఇది ప్రేరేపిస్తుంది. బాపు.. స్వదేశీ, స్వభాష, స్వరాజ్ ఆలోచనలు ఎల్లకాలం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. - కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
> జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు. బాపు ఆలోచనలు కేవలం దేశానికే కాదు, మొత్తం ప్రపంచానికి సత్యం, అహింస, ధర్మ మార్గాలను బోధిస్తాయి. - దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్
> జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా.. శాంతి, అహింసా ఆశయాలను ప్రజల్లో పెంపొందించడానికి, వాటిని వ్యాప్తి చేయడానికి కృషి చేద్దాం.- ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
> భారత స్వాతంత్య్రోద్యమ మహనీయుడు, అహింస మార్గాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి, గాంధీ. సత్యం, అహింస, ప్రేమ సందేశాన్ని అందించే 'బాపు' జీవితం, సామరస్యపూర్వక సమాజ స్థాపనకు బాటలు వేస్తుంది. - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం