BJP Leader Arrest: పోలీస్ వార్కు దారితీసిన భాజపా నేత అరెస్టు
దిల్లీలో ఓ భాజపా నేత అరెస్టు రాజకీయ దుమారానికి తెరలేపింది. భాజపా యువ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి తజిందర్ పాల్ సింగ్ను ఈ ఉదయం పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి
దిల్లీ, హరియాణా ఓ వైపు.. పంజాబ్ మరోవైపు
దిల్లీ/చండీగఢ్: దిల్లీలో ఓ భాజపా నేత అరెస్టు రాజకీయ దుమారానికి తెరలేపింది. భాజపా యువ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి తజిందర్ పాల్ సింగ్ను నేటి ఉదయం పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను బెదిరించిన కేసులో ఈ అరెస్టు చోటు చేసుకొంది. అయితే ఈ అరెస్టు జరిగిన కొద్ది గంటల్లోనే దిల్లీ పోలీసులు.. పంజాబ్ పోలీసులపై కిడ్నాప్ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట ఇటీవల భాజపా యువ విభాగం నేతలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తజిందర్ పాల్ సింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో ఈ వ్యాఖ్యలపై పంజాబ్లోని మొహాలీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పంజాబ్ పోలీసులు దర్యాప్తునకు హాజరవ్వాలంటూ గతంలో పలుమార్లు తజిందర్కు నోటీసులు జారీ చేశారు. అయితే వాటికి స్పందించకపోవడంతో శుక్రవారం ఉదయం దిల్లీలోని ఆయన స్వగృహంలో పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.
రంగంలోకి దిల్లీ పోలీసులు..
ఈ అరెస్టు ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఉదయం 10-15 మంది పోలీసులు తమ ఇంటికి వచ్చి దాడి చేశారని తజిందర్ తండ్రి దిల్లీ పోలీసులను ఆశ్రయించారు. తన కుమారుడికి ఎక్కడికో తీసుకెళ్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో దిల్లీ పోలీసులు.. పంజాబ్ పోలీసులపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తజిందర్ అరెస్టు గురించి పంజాబ్ పోలీసులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని దిల్లీ పోలీసులు ఆరోపించారు.
అడ్డుకున్న హరియాణా పోలీసులు..
తజిందర్ను కోర్టులో హాజరుపర్చేందుకు పంజాబ్ పోలీసులు మొహాలీకి తరలిస్తున్నారు. అయితే ఈ క్రమంలో వీరిని కురుక్షేత్ర వద్ద హరియాణా పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అడ్డుకున్నారేదానిపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే దిల్లీ పోలీసుల సమాచారంతోనే హరియాణా పోలీసులు ఈ చర్యకు దిగినట్లు భావిస్తున్నారు.
భాజపా ఫైర్..
ఈ అరెస్టుపై భాజపా మండిపడింది. పంజాబ్ పోలీసులు దారుణంగా వ్యవహరించారని, కనీసం తజిందర్ తలపాగా ధరించే సమయం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లారని కాషాయ పార్టీ నేతలు విమర్శించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ అరెస్టుకు పాల్పడినట్లు ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.