వయస్సు 22, రిపబ్లిక్ ప్రదర్శనలు 18!
మొత్తం 18 సార్లు రిపబ్లిక్ డే కవాతుల్లో పాల్గొన్న రియో వయస్సు 22 ఏళ్లే.
భారత సైన్యంలో జైపూర్కు చెందిన 61 కావల్రీ రెజిమెంట్కు చెందిన రియోకు ప్రదర్శనలు, కవాతులు కొత్త కాదు. దేశం గర్వంగా జరుపుకొనే గణతంత్ర దినోత్సవ కవాతుల్లో ఇప్పటికే అనేక సార్లు పాల్గొంది.. ఈ సారి కూడా పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది. రేపటి కార్యక్రమంతో సహా మొత్తం 18 సార్లు రిపబ్లిక్ డే కవాతుల్లో పాల్గొన్న రియో వయస్సు 22 ఏళ్లే. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా.. రియో ఓ అశ్వం మరి!
దిల్లీ: 61 కావల్రీ రెజిమెంట్, ప్రపంచంలోనే మనుగడలో ఉన్న ఏకైక అశ్వికదళ విభాగం. 12 అర్జున అవార్డులతో సహా ఎన్నో క్రీడాంశాల్లో బహుమతులు గెల్చుకున్న ఘనత దీని సొంతం. దీనికి తొలినుంచి భారత గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక స్థానం ఉంది. కాగా, ఈ మంగళవారం 72వ భారత్ గణతంత్ర వేడుకల్లో భాగంగా.. రియో ఈ విభాగాన్ని ముందుండి నడిపించనుంది. తన దళ కమాండర్ను సగర్వంగా వీపుపై ఎక్కించుకుని స్వారీ చేయనుంది.
హనోవేరియన్ జాతికి చెందిన ఈ గుర్రం భారత్లోనే పుట్టింది. తన నాలుగేళ్ల వయసు నుంచే రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొంటోంది. కెప్టెన్ దీపాంశు షెరాన్ శిక్షణలో మరింత రాటుదేలిన రియో.. చాలా ప్రత్యేకమైన అశ్వం. ఇది తన పైఅధికారి మాటలను విని, చక్కగా అర్ధం చేసుకుంటుందట.
ఇక రియోకు శిక్షణనిస్తున్న దీపాంశు షెరాన్ (27) ఉత్తరాఖండ్లోని కాశీపుర్కు చెందిన వారు. ఈయన కుటుంబంలో నాలుగు తరాలుగా సైన్యంలో సేవలందిస్తున్నారట. సంప్రదాయ రీతిలో యూనిఫాం ధరించి పాల్గోవటమే ఓ గొప్ప గౌరవం కాగా.. అదీ రియోను అధిరోహించటం మరీ ప్రత్యేకమని ఆయన అన్నారు. తాము దానిని ఎంతో ప్రత్యేక శ్రద్ధతో చూసుకుంటామని దీపాంశు చెప్పారు. స్వారీ చేస్తున్న వ్యక్తి చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటింటటం రియోకు పరిపాటి. కాగా తమ అశ్వికదళం దేశ గతం, వర్తమానాలకు మధ్య సంబంధంగా నిలుస్తోందని ఆయన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.