కరోనా సెకండ్ వేవ్: చిన్నారులపైనా ప్రభావం
ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గతేడాది కరోనా వైరస్
న్యూదిల్లీ: ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గతేడాది కరోనా వైరస్ విజృంభించిన సమయంలోనూ పాజిటివ్ వచ్చిన చిన్నారులు చాలా అరుదు. అదే సమయంలో ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. తాజాగా చిన్నారులు సైతం కరోనా బారిన పడుతున్నారు. వారిలో తక్కువ, మధ్యస్థాయి లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం పదేళ్లు అంతకు మించిన వారు మాత్రమే కాదు. ఏడాది నుంచి 8ఏళ్ల వయసు వారిలోనూ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘‘చిన్నారుల్లో తీవ్రమైన జ్వరం వస్తోంది. శరీర ఉష్ణోగ్రత 101-102 డిగ్రీలు నమోదవుతోంది. వెంటనే జ్వరం తగ్గడం లేదు. గతవారం కరోనా బారిన పడిన పదేళ్లు అంతకు మించి వయసు ఉన్న పిల్లలకు వైద్యం చేశాం’ అని దిల్లీలోని గంగారామ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ధీరేన్ గుప్త తెలిపారు. జ్వరంతో పాటు, ముక్కు దిబ్బడ, పొత్తి కడుపులో నొప్పి, విరోచనాల వంటి లక్షణాలతో చిన్నారులు బాధపడుతున్నారు. ‘గతంలో చిన్నారులు కరోనా బారిన పడినా ఎలాంటి లక్షణాలు ఉండేవి కావు. ప్రస్తుతం తల్లిదండ్రుల నుంచి చిన్నారులకు కరోనా వ్యాపిస్తోంది. గతేడాది పోలిస్తే, ఇలాంటి కేసుల సంఖ్య రెండింతలుగా ఉంది. గొంతనొప్పి, నీరసం, తలనొప్పి, అలసటతో ఎక్కువమంది చిన్నారులు బాధపడుతున్నారు’ అని మ్యాక్స్ ఆస్పత్రి చెందిన సీనియన్ డైరెక్టర్, పీడియాట్రిషన్ డాక్టర్ శ్యామ్ కుక్రేజా తెలిపారు.
ఈ నేపథ్యంలో చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలా? వద్దా? అన్న దానిపై చర్చ కొనసాగుతోంది. భవిష్యత్లో చిన్నారులకు కూడా వ్యాక్సిన్ తప్పనిసరి అన్న అభిప్రాయాన్ని కుక్రేజా వ్యక్తం చేశారు. అందుకు మరో ఏడాది కాలం పట్టవచ్చని పేర్కొన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 30శాతం కన్నా ఎక్కువ కేసులు ఉత్పరివర్తనం చెందిన వైరస్ కారణంగా వస్తున్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..