Ukraine crisis: భారతీయుల తరలింపునకు ముందుకొచ్చిన స్పైస్జెట్, ఇండిగో!
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు మరికొన్ని విమానయాన సంస్థలు ముందుకొచ్చాయి.....
దిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు మరికొన్ని విమానయాన సంస్థలు ముందుకొచ్చాయి. స్పైస్జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో సంస్థలు హంగరి రాజధాని బుడాపెస్ట్, రొమానియా రాజధాని బుకారెస్ట్ నుంచి సోమ, మంగళవారాల్లో ప్రత్యేక విమానాలు నడపనున్నట్టు ప్రకటించాయి. రష్యా సేనల భీకర దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని శనివారం సాయంత్రం నుంచి రొమేనియా, హంగరి దేశాల నుంచి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమంలో భాగంగా తీసుకొస్తోంది. ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో ఆ దేశ సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగరికి చేరుకుంటున్న భారత పౌరుల్ని ఇప్పటికే ఎయిరిండియా విమానంలో తరలిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆరు విమానాల్లో దాదాపు 1400 మందిని స్వదేశానికి తీసుకొచ్చారు. దాదాపు ఇంకా 14వేల మందికి పైగా పౌరులు అక్కడ చిక్కున్నట్టు అంచనా.
దీంతో బోయింగ్ 373 మ్యాక్స్ ప్రత్యేక విమానం ఈ సాయంత్రం దిల్లీ నుంచి బయల్దేరి బుడాపెస్ట్కు వెళ్తుందని స్పైస్జెట్ సంస్థ వెల్లడించింది. కుటైసీ, జార్జియా మీదుగా సేవలందిస్తుందని పేర్కొంది. మరిన్ని విమానాలను నడిపేందుకు వీలుగా అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది. అలాగే, బుకారెస్ట్ నుంచి ముంబయికి 182 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి విమానం బయల్దేరుతుందని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది. కువైట్లో ఇంధనం నింపుకొనేందుకు ఆగుతుందని, ఆ తర్వాత ఈ విమానం మంగళవారం ఉదయం 9.30గంటలకు ముంబయికి చేరుకుంటుందని వివరించింది. అలాగే, భారతీయుల్ని సురక్షితంగా తీసుకొచ్చేందుకు వీలుగా తాము రెండు ఎ-321 విమానాలను నడుపుతామని ఇండిగో సంస్థ ప్రకటించింది. సోమవారం ఈ రెండు విమానాలు బుకారెస్ట్, బుడాపెస్ట్కు వెళ్లి.. ఇస్తాంబుల్ మీదుగా మంగళవారం దిల్లీ చేరుకుంటాయని ఇండిగో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.