కొవిడ్ ఉద్ధృతి: తమిళనాడులో తాజా ఆంక్షలివే!
చెన్నై: కరోనా విలయతాండవం రాష్ట్రాల్లో అలజడి రేపుతోంది. మహమ్మారి ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే రాష్ట్రాలన్నీ ఒక్కొక్కటిగా ఆంక్షల వైపు అడుగులేస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ జాబితాలోకి చేరింది.
చెన్నై: కరోనా విలయ తాండవం కొన్ని రాష్ట్రాల్లో అలజడి రేపుతోంది. మహమ్మారి ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఒక్కొక్కటిగా ఆంక్షల వైపు అడుగులేస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ జాబితాలోకి చేరింది. కర్ఫ్యూ, వారాంతాల్లో లాక్డౌన్ జోలికి వెళ్లకుండా కఠిన ఆంక్షల వైపు మొగ్గుచూపింది. మాస్కులు ధరించి, కరోనా జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు విఫలమైనందువల్ల ఈ ఆంక్షలు తప్పడం లేదని చెప్పింది. ఏప్రిల్ 10నుంచి అమల్లోకి రానున్నాయి.
తాజా ఆంక్షలివే..
* పండుగలు, మతపరమైన బహిరంగ సమావేశాలపై నిషేధం.
* చెన్నైలోని ఎంటీసీ బస్సులతో సహా రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో సీట్లకు మించి ప్రయాణికులకు అనుమతి లేదు.
* అంతరాష్ట్ర బస్సు సర్వీసులకూ ఇదే పద్ధతి.
* తదుపరి ఉత్వర్వులు వచ్చేవరకూ చెన్నైలోని కోయంబేడు మార్కెట్లో పండ్లు, కూరగాయల దుకాణాలు బంద్.
* టీ కొట్టు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్లు, సినీ థియేటర్లు, మల్టీప్లెక్స్లను 50 శాతం సిట్టింగ్ సామర్థ్యంతో మాత్రమే నడపాలి.
* కేవలం 100 మందితోనే శుభకార్యాల నిర్వహణ.
* సామాజిక, రాజకీయ, విద్య, వినోదం, క్రీడ, సాంస్కృతిక కార్యక్రమాలకు 200 మందికి అనుమతి.
* ప్రార్థన మందిరాల్లోకి భక్తులకు రాత్రి 8 గంటల వరకే అనుమతి. పండుగలు, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం.
* సినిమా షూటింగ్, ఇతర కార్యక్రమాలను కరోనా నిబంధనల మేరకే అనుమతి.
* కంటైన్మెంట్ జోన్గా గుర్తించిన ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ ఆంక్షల అమలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.