Chennai: సినీఫక్కీలో నటరాజ స్వామి విగ్రహం స్వాధీనం
దాదాపు 130 ఏళ్ల క్రితంనాటి 26.8 కేజీల నటరాజ విగ్రహాన్ని తమిళనాడు సీఐడీ పోలీసులు సినీ ఫక్కీలో స్వాధీనం చేసుకున్నారు. దీని కోసం వారు విగ్రహాల ఎగుమతిదారుల అవతారం ఎత్తారు.
చెన్నై: దాదాపు 130 ఏళ్ల క్రితంనాటి 26.8 కేజీల నటరాజ విగ్రహాన్ని తమిళనాడు సీఐడీ పోలీసులు సినీ ఫక్కీలో స్వాధీనం చేసుకున్నారు. దీని కోసం వారు విగ్రహాల కొనేవారుగా అవతారం ఎత్తారు. ఇంతకీ ఏం జరిగిందంటే కేరళలోని పలక్కాడ్కు చెందిన శివప్రసాద్ నంబూద్రి అనే వ్యక్తి మధ్యవర్తి ద్వారా నెలరోజుల క్రితం రూ.8 కోట్లకు నటరాజ విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు యత్నించాడని తమిళనాడు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఆయన వద్ద విగ్రహం ఉందో? లేదో తెలుసుకునేందుకు విగ్రహాలు కొనేవారుగా పరిచయం చేసుకొని ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ఆధారాల కోసం ఆయనతో మాట్లాడిన ఫోన్కాల్స్ను రికార్డు చేశారు. గత నెలరోజులుగా ఈ తతంగం సాగుతోంది. ఒకసారి మాటల మధ్యలో 300 ఏళ్లనాటి నటరాజ విగ్రహం ఉందని, రూ.8కోట్లకు విక్రయించాలను కుంటున్నానని శివప్రసాద్ చెప్పేశాడు. అదే అదునుగా విగ్రహం కొనుగోలుకు కోయంబత్తూరు రావాలని కొనుగోలుదారుడిగా మాట్లాడుతున్న ఎస్సై పాండ్యరాజన్ అతడిని కోరారు. దీంతో నవంబరు 6న శివప్రసాద్ నంబూద్రి మరో వ్యక్తితో కలిసి కారులో కోయంబత్తూరు లోని పల్లాడం కూడలికి రాగానే.. ప్రణాళిక ప్రకారం ఏడీఎస్పీ జయంత్ మురళి నేతృత్వంలోని కొంత మంది పోలీసులు అక్కడ వారిని అడ్డగించి తనిఖీ చేపట్టారు. కారులో విగ్రహం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే డ్రైవర్తోపాటు శివప్రసాద్ను అరెస్టు చేశారు. మధ్యవర్తి ద్వారా విగ్రహం విక్రయించాలని ఇక్కడికి వచ్చినట్లు నిందితుడు అంగీకరించాడు. ఈ ఆపరేషన్లో భాగస్వాములైన పోలీసులను డీజీపీ శైలేంద్రబాబు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.