Covid-19: సాయుధ బలగాల్లో 70వేల మందికి కరోనా..!
దేశంలో ఇప్పటివరకు సాయుధ బలగాల్లోనే 70 వేల మంది సిబ్బందికి వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇప్పటివరకు 190 మంది మరణించారన్న కేంద్ర ప్రభుత్వం
దిల్లీ: కొవిడ్-19 మహమ్మారితో వణికిపోయిన భారత్లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్ల 40లక్షల మంది వైరస్ బారినపడి కోలుకున్నారు. ఇదే సమయంలో సాయుధ బలగాల్లోనే 70 వేల మంది సిబ్బందికి వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 190 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. సాయుధ బలగాల్లో కొవిడ్ కేసులపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు రక్షణశాఖ సహాయమంత్రి అజయ్ భట్ ఈ సమాధానమిచ్చారు.
దేశంలో వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు సాయుధ బలగాల్లో మొత్తం 70 వేల మందికి వైరస్ సోకగా.. ఇండియన్ ఆర్మీలో అత్యధికంగా 45,576 మంది సైనికులు వైరస్ బారినపడ్డారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 14,022 సిబ్బంది, ఇండియన్ నేవీలో 7,747 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి వెల్లడించారు. వైరస్ సోకిన మొత్తం సాయుధ బలగాల్లో ఇప్పటివరకు 190 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. వీరిలో ఇండియన్ ఆర్మీలోనే 137 మంది చనిపోగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 49 మంది, ఇండియన్ నేవీలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
అయితే, విధుల్లో ఉన్న సమయంలో ఎవరైనా ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయినట్లయితే ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం వారికి ప్రత్యేకంగా ఎటువంటి పరిహారం లభించే అవకాశం లేదని కేంద్ర రక్షణశాఖ వెల్లడించింది. అయినప్పటికీ విధుల్లో ఉన్న సమయంలో మరణానంతరం సాధారణంగా వచ్చే ప్రయోజనాలను మాత్రం పొందుతారని తెలిపింది. వీటికి అదనంగా జాతీయ విపత్తు నిర్వహణ సాధికార సంస్థ (NDMA) మార్గదర్శకాల ప్రకారం రూ.50వేల కొవిడ్ పరిహారం అందుతుందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.