China Lockdown: కొవిడ్ విజృంభణ..అధికారులపై వేటు వేస్తోన్న చైనా!
వైరస్ కట్టడిలో విఫలమయ్యారంటూ అక్కడి అధికారులపై చైనా వేటు వేసింది.
కఠిన ఆంక్షలు కొనసాగిస్తోన్న చైనా అధికారులు
బీజింగ్: జీరో కొవిడ్ (Zero Covid) వ్యూహాన్ని అనుసరిస్తోన్న చైనా.. వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా జియాన్ నగరంలో కేసుల సంఖ్య పెరగడంతో నగరం మొత్తం లాక్డౌన్ విధించింది. ఇదే సమయంలో వైరస్ కట్టడిలో విఫలమయ్యారంటూ ఏకంగా 26 మంది అధికారులపై వేటు వేసింది. వచ్చే ఫిబ్రవరిలో శీతాకాల ఒలింపిక్స్ (Winter Olympics)కు సిద్ధమవుతోన్న చైనా.. ప్రధాన నగరాల్లో వైరస్ ఉద్ధృతి మరోసారి పెరుగుతుండడంతో ఆందోళనకు గురవుతోంది. దీంతో కొవిడ్ ఆంక్షలు కఠినతరం చేయడంతో పాటు వైరస్ నియంత్రణ చర్యల్లో విఫలమైన అధికారులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది.
చైనాలో పెద్ద నగరాల్లో ఒకటైన జియాన్లో ఇటీవల ఒక్కరోజే 49 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. వారంలోనే కేసుల సంఖ్య 250కు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 1.3కోట్ల జనాభా ఉన్న నగరంలో పూర్తి లాక్డౌన్ ఆంక్షలు విధించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు. నిత్యావసరాల కోసం రెండు రోజులకు ఒకసారి మాత్రమే బయటకు రావాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో వైరస్ కట్టడిలో విఫలమయ్యారనే కారణంతో తాజాగా 26మంది అధికారులపై వేటు వేసినట్లు అక్కడి కేంద్రీయ క్రమశిక్షణ తనిఖీ కమిషన్ వెల్లడించింది. ముఖ్యంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, అధికారులతో సమన్వయం పరచుకోవడంలో విఫలమయినందునే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
కొవిడ్ నియంత్రణలో వైఫల్యం చెందిన అధికారులను మందలించడం లేదా తొలగించడం వంటి చర్యలు చైనా గతకొంతకాలంగా చేపడుతూనే ఉంది. ఈ మధ్యే ఇన్నర్ మంగోలియాలో కొవిడ్ కేసులు పెరగడంతో అక్కడి ఉన్నతాధికారిపై వేటు వేసింది. ఈ ఏడాది ఆగస్టులో షేంగ్జుహౌలో పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో అక్కడి ఆరోగ్య కమిషన్ చీఫ్ను తొలగించింది. తాజాగా జియాన్ నగరంలో ఏకంగా 26మందిపై చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో జియాన్ నగరం నుంచి బీజింగ్తోపాటు ఐదు ప్రధాన నగరాలకు వైరస్ వ్యాపించిందని అక్కడి అధికారులు వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరిలో శీతాకాల ఒలింపిక్స్ జరుగనున్న నేపథ్యంలో పలు నగరాల్లో వైరస్ విజృంభించడంతో చైనా అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..