Lockdown in China: చైనాలో కఠిన లాక్డౌన్ ఆంక్షలు..ప్రజల ఆకలి కేకలు..
కఠిన లాక్డౌన్ నేపథ్యంలో ఉత్తర జియాన్ నగరంలోని 1.3కోట్ల మంది ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలు కరవై విలవిల్లాడుతున్నారు.......
బీజింగ్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు చైనా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కఠిన లాక్డౌన్ నేపథ్యంలో ఉత్తర జియాన్ నగరంలోని 1.3కోట్ల మంది ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలు కరవై విలవిల్లాడుతున్నారు. తమ సమస్యలపై సామాజిక మాధ్యమాల ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇల్లు దాటి వెళ్లనివ్వడంలేదు. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం కష్టతరమవుతోంది’ అని జియాన్కు చెందిన ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా తన గోడువెళ్లబోసుకున్నాడు.
అయితే అధికారులు మాత్రం ఇలాంటి ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ప్రజలకు ఆహారం, వైద్యసదుపాయాలు సహా నిత్యవసరాలకు ఎలాంటి కొరతలేదని చెప్పుకొస్తున్నారు. నగరంలో కఠిన ఆంక్షలను విధించడాన్ని సమర్థించుకున్నారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టాలంటే ఈ చర్యలు తప్పవని పేర్కొన్నారు. వింటర్ ఒలిపింక్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశంలో కొవిడ్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు యత్నిస్తున్నారు.
తగ్గినట్లే తగ్గి చైనాలో కరోనా మళ్లీ వ్యాపిస్తోంది. జియాన్ నగరంలో కొద్దిరోజులుగా మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు మొత్తగా 1600లకు పైగానే కేసులు వెలుగుచూసినట్లు ప్రభుత్వ అధికార మీడియా తెలిపింది. ఇందులో అధికశాతం డెల్టా వేరియంట్ బారిన పడ్డవారే ఉన్నారని, తాజా ఒమిక్రాన్ వ్యాప్తి తక్కువగానే ఉన్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శీతాకాల ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకొని చైనా జీరో కొవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.