Rajiv Gandhi Assassination: ఆ ఘోరకలి నా జీవితాన్ని మార్చేసింది
‘ఆ దుర్ఘటన నా దృక్పథాన్ని.. జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో ఏం జరిగిందన్నది
రాజీవ్ హత్యకేసు ప్రత్యక్షసాక్షి ఫిలిప్
నాటి అనుభవం పుస్తకంగా తెస్తానని వెల్లడి
చెన్నై: ‘ఆ దుర్ఘటన నా దృక్పథాన్ని.. జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిందే. భారత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ ఎన్నికల సభలో ఎల్టీటీఈ మానవబాంబు పేలి రాజీవ్తోపాటు మరో 14 మంది దారుణంగా మృత్యువాత పడ్డారు. నాటి ఘోరకలి నుంచి బతికి బయటపడ్డవారిలో ఇప్పటికీ సజీవంగా ఉన్నది నేనొక్కడినే. గత 30 ఏళ్లుగా నా సర్వీసు పొడవునా నన్ను వెంటాడిన ఈ భయంకరమైన అనుభవాన్ని ఓ పుస్తకంగా తీసుకువస్తా’ అని రెండు రోజుల కిందట చెన్నైలో డీజీపీ (ట్రెయినింగ్)గా పదవీ విరమణ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రదీప్ వి.ఫిలిప్ ‘పీటీఐ’ వార్తాసంస్థకు తెలిపారు. 1991లో కాంచీపురం ఏఎస్పీగా ఉన్న ఫిలిప్ నాటి దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన టోపీ, నామఫలకం (బ్యాడ్జి) కింద పడిపోయాయి. వాటిని నేరస్థల సాక్ష్యాలుగా సేకరించారు. రాజీవ్ హత్యకేసు విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ వస్తువులను కోర్టు కస్టడీలో పెట్టింది. మళ్లీ ఇన్నాళ్లకు.. రూ.లక్ష పూచీకత్తు మీద సిటీ కోర్టు ఇచ్చిన అనుమతితో తన టోపీ, నామఫలకాన్ని పదవీ విరమణ వేడుక సందర్భంగా సర్వీసులో చివరిరోజైన సెప్టెంబర్ 30న ఫిలిప్ ధరించారు. రక్తపు మరకలంటిన ఈ రెండింటినీ చూసి ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
* పీటీఐతో ఫిలిప్ మాట్లాడుతూ.. ‘ఈ టోపీ, బ్యాడ్జి.. నా రక్తం, చెమట, కన్నీళ్లకు సాక్ష్యాలు. 34 ఏళ్ల సర్వీసు మొదలైన తొలిరోజుల్లోనే ఎదుర్కొన్న భయానక అనుభవానికి నిదర్శనాలు. మరణం అంచులను చూపించిన ఈ దుర్ఘటన తర్వాత స్థాయి కోసం, అధికారం కోసం నేను ఎన్నడూ పాకులాడలేదు. ప్రజలకు నేను ఏం చేయగలను అనే ఆలోచించా. పోలీసు అధికారాన్ని మానవతాకోణంలోనే వాడా’ అని గుర్తు చేసుకున్నారు. వృత్తి జీవితంలో ఫిలిప్ ప్రవేశపెట్టిన ‘ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్’ (ఎఫ్వోపీ) భావన బహుళ ప్రాచుర్యం పొందింది. ఇప్పటికే 30 పుస్తకాలు రాసిన ఫిలిప్ ‘నేనింకా చేయాల్సింది చాలా ఉంది’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.