Omicron Scare: టీకా తీసుకోలేదా.. హోటల్స్, మాల్స్లోకి నో ఎంట్రీ..!
దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో తమిళనాడులోని మదురై నగరం ఆంక్షల కొరడా ఝులిపించింది. టీకా తీసుకోని వారు వచ్చేవారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశించకుండా శనివారం నిబంధనలు జారీచేసింది.
వచ్చేవారం నుంచి తమిళనాడు నగరంలో అమల్లోకి ఆంక్షలు
చెన్నై: దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో తమిళనాడులోని మదురై నగరం ఆంక్షల కొరడా ఝులిపించింది. టీకా తీసుకోని వారు వచ్చేవారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశించకుండా శనివారం నిబంధనలు జారీచేసింది. మాల్స్, మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్సులతో సహా 18 ప్రదేశాలకు అనుమతి నిరాకరించింది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చేలోపు ప్రజలు కనీసం ఒక్కడోసు టీకా అయినా వేయించుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించింది.
‘ప్రజలు కనీసం ఒక్కడోసు టీకా అయినా వేయించుకునేందుకు ఒక వారం సమయం ఇచ్చాం. ఆ గడువులోగా టీకా తీసుకోని వ్యక్తులు మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, ఇతర వాణిజ్య సముదాయాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండదు’ అని మదురై కలెక్టర్ అనీశ్ శేఖర్ మీడియాకు వెల్లడించారు. జిల్లాలో సుమారు 3 లక్షల మంది కనీసం ఒక్కడోసు టీకా కూడా తీసుకోలేదని తెలిపారు. తమ దగ్గర 71.6 శాతం మందికి మొదటి డోసు.. 32.8 శాతం మందికి రెండో డోసు అందిందన్నారు. ఇప్పటికే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన కర్ణాటక కూడా శుక్రవారం ఈ తరహా ఆంక్షలే తీసుకువచ్చింది. మాల్స్, సినిమా హాల్స్, బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి రెండు డోసుల టీకాను ఆ రాష్ట్రం తప్పనిసరి చేసింది.
కాగా, సింగపూర్, యూకే నుంచి తమిళనాడుకు వచ్చిన ముగ్గురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా తేలింది. వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. ప్రస్తుతం వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. తమిళనాడులో తాజాగా 711 కొత్త కేసులు, 9 మరణాలు సంభవించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.