INSACOG: భారత్లో ఒమిక్రాన్ తీవ్రత.. ఇంకాస్పష్టమైన ఆధారాల్లేవ్..!
ఒమిక్రాన్ ప్రాబల్యం, రోగనిరోధకత నుంచి తప్పించుకోవడం లేదా తీవ్రతపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది.
జీనోమిక్స్ కన్సార్టియం ఇన్సాకోగ్ వెల్లడి
దిల్లీ: కొత్తగా వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ విస్తృత వేగంతో వ్యాపిస్తోందన్న వార్తలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన పలు దేశాలు.. ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. మరోవైపు భారత్లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ ప్రాబల్యం, రోగనిరోధకత నుంచి తప్పించుకోవడం లేదా తీవ్రతపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళనకర వేరియంట్గా ప్రకటించిన నేపథ్యంలో ప్రజారోగ్య చర్యలు పెంచడంతోపాటు, వేరియంట్ ప్రభావాలపై పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఇన్సాకోగ్ తాజా బులిటెన్లో పేర్కొంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా డెల్టా (B.1.617.2)తో పాటు దాని అనుబంధ రకాల ప్రాబల్యమే అధికంగా ఉందని తెలిపింది. ‘దక్షిణాఫ్రికాలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరికలు తక్కువగానే ఉన్నప్పటికీ ఇవి కూడా క్రమంగా ఎక్కువ అవుతున్నాయి. మరోవైపు బ్రిటన్లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది’ అని ఇన్సాకోగ్ వెల్లడించింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం బట్టి ఒమిక్రాన్కు వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొంది.
అయితే, అది ఇదివరకు ఇన్ఫెక్షన్ వల్లా లేదా వ్యాక్సినేషన్ వల్ల కలిగిన రక్షణా? అనే విషయంపై స్పష్టత లేదని ఇన్సాకోగ్ పేర్కొంది. అదే విధంగా వ్యాక్సిన్ తీసుకోని వారితోపాటు పాక్షికంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉందో చెప్పేందుకు సరైన సమాచారం లేదని ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. మరోవైపు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో వెలుగుచూసిన ఈ వేరియంట్ కేసులు 150కి పైగా బయటపడ్డాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 54 మంది ఈ వేరియంట్ బారినపడ్డారు. రాజస్థాన్, తెలంగాణాల్లోనూ ఈ కేసుల సంఖ్య 20 దాటింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.