జవహర్లాల్ నెహ్రూ జయంతి.. ప్రముఖుల గైర్హాజరీపై విపక్షాల మండిపాటు
భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు.
దిల్లీ: భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా నెహ్రూకు అంజలి ఘటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మహానేతకు నివాళులు అర్పించారు. దిల్లీలోని శాంతివనం నెహ్రూ స్మారకం వద్దకు వెళ్లిన సోనియా గాంధీ, భారత తొలి ప్రధానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నెహ్రూ సేవలను స్మరించుకున్న సోనియా గాంధీ.. త్రివర్ణ రంగుల్లో ఉన్న బెలూన్లను గాలిలోకి విడిచిపెట్టారు. పలువురు కాంగ్రెస్ ప్రముఖులు కూడా నెహ్రూ స్మారకానికి నివాళులు అర్పించారు.
1889 నవంబర్ 14న ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జన్మించిన నెహ్రూ.. భారత స్వాతంత్ర్య సముపార్జనలో కీలకపాత్ర పోషించారు. 1947 ఆగస్టు 15న భారత తొలి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన ఆయన 1964 మే 27న తుదిశ్వాస విడిచారు. చిన్నారులను అమితంగా ఇష్టపడే నెహ్రూ పుట్టినరోజును జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకొంటున్న విషయం తెలిసిందే.
ప్రభుత్వ తీరుపై మండిపడ్డ విపక్షాలు..
నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు రాజ్యసభ ఛైర్మన్, లోక్సభ స్పీకర్తో పాటు కేంద్ర మంత్రులు నివాళులు అర్పించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రముఖుల జయంతి రోజు వారికి నివాళులు అర్పించేందుకు సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై మండిపడింది.
‘పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసిన ప్రముఖ నాయకుల చిత్రపటాల్లో ఉన్నవారి జయంతి రోజు వారికి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, నెహ్రూ జయంతి సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ రాలేదు. రాజ్యసభ ఛైర్మన్ కూడా గైర్హాజరు అయ్యారు. కనీసం ఒక్క కేంద్ర మంత్రి కూడా హాజరు కాలేదు. దీనికంటే దారుణం ఏమైనా ఉంటుందా..?అని రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జైరాం రమేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జైరాం రమేష్ ట్వీట్కు తృణమూల్ నేత డెరెక్ ఓబ్రెయిన్ కూడా స్పందించారు. ఇందులో నాకేం ఆశ్చర్యం కలగడం లేదని.. పార్లమెంటుతో సహా దేశంలో గొప్ప వ్యవస్థలను ఒక్కొక్కటిగా నాశనం చేయడం ఇందుకు మినహాయింపు ఏమీ కాదని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.