UK: ఓ వైపు ఒమిక్రాన్ విజృంభణ.. మరోవైపు టీకాలు మాకొద్దంటూ నిరసన
ప్రభుత్వం బలవంతంగా కొవిడ్ టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందంటూ బ్రిటన్ ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.......
లండన్లో ఐదువేల మంది ఆందోళన
లండన్: బ్రిటన్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్నప్పటికీ.. అక్కడి ప్రజల్లో మాత్రం మార్పు రావడంలేదు. వ్యాక్సిన్లు వేసుకునేందుకు కొందరు ముందుకు రావడం లేదు. రోజూ వేలాది ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో.. కట్టడి చర్యల్లో భాగంగా యూకే ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. అయితే ప్రభుత్వం బలవంతంగా టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందంటూ అక్కడి ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ‘యునైటెడ్ ఫర్ ఫ్రీడం మార్చ్’ పేరిట సెంట్రల్ లండన్లో ఆందోళనలు నిర్వహించారు.
ఈ ఆందోళనల్లో దాదాపు ఐదువేల మంది పాల్గొన్నారు. పార్లమెంటు స్క్వేర్తో పాటు ప్రధాని అధికారిక నివాసం డౌనింగ్ స్ట్రీట్ వద్ద కూడా నిరసనలు జరిగాయి. అయితే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా.. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఆ ఘర్షణలకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
బ్రిటన్లో ఒమిక్రాన్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. శనివారం 10వేలకు పైగా కొత్త కేసులు నిర్ధరణ అయ్యాయి. వ్యాధి సోకినవారిని ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్ సేవలు కరవయ్యాయి. అంబులెన్స్ సిబ్బంది కూడా ఒమిక్రాన్ బారిన పడుతుండటంతో వారు హాస్పిటళ్లు, ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. గత వారంతో పోలిస్తే ఈ వారం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 28.6 శాతం పెరిగినట్లు ప్రభుత్వ నివేదికలు తెలుపుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.