Rajya Sabha: మూడో వారంలోమరింత తగ్గిన రాజ్యసభ ఉత్పాదకత

రాజ్యసభ శీతాకాల సమావేశాల ఉత్పాదకత మూడో వారంలో కనిష్ఠానికి చేరుకుంది. కేవలం 37.60 శాతం మాత్రమే నమోదైంది......

Published : 19 Dec 2021 23:55 IST

దిల్లీ: రాజ్యసభ శీతాకాల సమావేశాల ఉత్పాదకత మూడో వారంలో కనిష్ఠానికి చేరుకుంది. కేవలం 37.60 శాతం మాత్రమే నమోదైంది. 12 మంది సభ్యుల సస్పెన్షన్‌కు సంబంధించి విపక్షాల ఆందోళనలతో ఏర్పడిన అంతరాయాలు, తప్పనిసరి వాయిదాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సెక్రెటేరియట్ వివరాల ప్రకారం.. మొదటి రెండు వారాల్లో సభ ఉత్పాదకత 49.70 శాతం, 52.50 శాతంగా ఉంది. మొత్తం మూడు వారాలు కలిపి 46.70 శాతంగా నమోదైనట్లు రాజ్యసభ సెక్రెటేరియట్ తెలిపింది.

మూడో వారంలో షెడ్యూల్‌ చేసిన మొత్తం 27.11 గంటలకు సంబంధించి.. సభ కేవలం 10.14 గంటలు మాత్రమే సభ పనిచేసింది. ప్రత్యేకించి ప్రశ్నోత్తరాల సమయం బాగా వృథా అయింది. ఇందుకు కేటాయించిన సమయంలో కేవలం 11.40 శాతం మాత్రమే సద్వినియోగం అయినట్లు సెక్రెటేరియట్‌ వెల్లడించింది. జాబితా చేసిన 75 ప్రశ్నల్లో కేవలం నాలుగింటికి మాత్రమే మంత్రులు మౌఖికంగా సమాధానమివ్వగలిగారని తెలిపింది. మూడు బిల్లులు ఆమోదం పొంది, తిరిగి వచ్చాయంది. మొత్తం మూడు వారాల్లో సభ్యులు 15 సార్లు సమావేశం కాగా.. ఆరు సార్లు సభ రోజుకు గంట కంటే తక్కువ సమయం మాత్రమే పనిచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని