SC: ‘ఏడాదిగా చెప్పిందే చెబుతున్నారు.. మీకిదే లాస్ట్ ఛాన్స్..!’
ట్రైబ్యునళ్ల ఏర్పాటు, సభ్యుల నియామకాల్లో జాప్యం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్ల పదవుల నియామకాల్లో కేంద్రం
ట్రైబ్యునళ్ల సభ్యుల నియామకాల్లో జాప్యంపై సుప్రీం ఆగ్రహం
దిల్లీ: ట్రైబ్యునళ్ల ఏర్పాటు, సభ్యుల నియామకాల్లో జాప్యం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్ల పదవుల నియామకాల్లో కేంద్రం ఏడాదిగా చెప్పిందే చెబుతోంది తప్ప ఆచరణ లేదని సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం పాటించడం లేదని ఆగ్రహించింది. 10 రోజుల్లోగా ట్రైబ్యునళ్లలో నియామకాలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేసేందుకు ఎందుకింత ఆలోచిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీం ఆదేశాలను అమలు చేస్తామని గత విచారణ సమయంలో చెప్పిన కేంద్రం ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అడిగింది. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ట్రైబ్యునళ్ల ఏర్పాటు, ఖాళీల నియామకానికి 2 వారాల గడువు ఇవ్వాలని కోరారు. దీంతో అసహనానికి గురైన ధర్మాసనం.. ‘‘ఇదే చివరి అవకాశం. మరోసారి సమయం ఇవ్వడం కుదరదు. 10 రోజుల్లోగా నియామకాలు చేపట్టండి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి’’ అని హెచ్చరించింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 31వ తేదీకి వాయిదా వేసింది.
ఈ సందర్భంగా ట్రైబ్యునల్ రిఫామ్స్ బిల్లు 2021పైనా సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆర్డినెన్సును కోర్టు నిలిపివేసిన తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. అసలు ట్రైబ్యునళ్లను కొనసాగిస్తారా లేదా మూసివేస్తారా అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని సూచించింది. ట్రైబ్యునల్ రిఫామ్స్ బిల్లు ఆగస్టు 3న లోక్సభలో, ఆగస్టు 9న రాజ్యసభలో ఆమోదం పొందింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.