Lakhimpur Kheri Violence: కేంద్రమంత్రి తనయుడికి సమన్లు జారీ
లఖింపుర్ ఖేరి కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటోన్న కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాకు గురువారం ఉత్తర్ప్రదేశ్ పోలీసులు సమన్లు జారీ చేశారు.
ఆయనపై మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు పోలీసు వర్గాల వెల్లడి
లఖ్నవూ: లఖింపుర్ ఖేరి కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటోన్న కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాకు గురువారం ఉత్తర్ప్రదేశ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన్ను విచారించే నిమిత్తం ఈ చర్య చేపట్టారు. అలాగే ఈ కేసులో భాగంగా ఆయనపై మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. లఖింపుర్ కేసులో ఇప్పటివరకు ఎంతమందిని అరెస్టు చేశారంటూ ఈ రోజు సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ క్రమంలోనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
‘ఆశిష్కు సమన్లు జారీ అయ్యాయి. ఆయన్ను సాధ్యమైనంత త్వరగా ప్రశ్నించనున్నాం. ఆయనపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది’ అని ఆ వర్గాలు తెలిపాయి. ఆశిష్పై సోమవారమే ఎఫ్ఐఆర్ నమోదైంది. అలాగే ఆ హింసాకాండకు సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి అనేక ఆధారాలు లభించినట్లు పోలీసులు చెప్పారు.
మరోపక్క ఆశిష్ మిశ్రాను రేపటిలోగా అరెస్టు చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తానని పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ హెచ్చరించారు. లఖింపూర్కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయన్ను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంత్రి కొడుకుని త్వరలోనే అరెస్టు చేస్తాం: పోలీసులు
కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కోసం పోలీసులు గాలిస్తున్నారని ఉత్తర్ప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. లఖింపుర్ ఘటనలో హత్యారోపణలు ఎదుర్కొంటోన్న ఆయన్ను సాధ్యమైనంత త్వరలో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ‘ఆ ప్రాంతంలో నిరసన తెలుపుతోన్న రైతులపై ఆశిష్ కాల్పులు జరిపాడని, వారిపై నుంచి దూసుకెళ్లిన కారులో మంత్రి కుమారుడు ఉన్నాడని ఎఫ్ఐఆర్ను బట్టి అర్థమవుతోంది. అలాగే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సమాచారం కూడా ఈ కేసు దర్యాప్తులో ఉపయోగించనున్నాం’ అని ఆ అధికారి పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. తనపై వస్తోన్న ఆరోపణలను గతంలోనే ఆశిష్ మిశ్రా కొట్టిపారేశారు. ‘నేను ఆ సమయంలో బన్వారీపూర్లో ఉన్నాను. ఉదయం తొమ్మిది నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నాను. నాపై మోపిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి. దీనిపై న్యాయ విచారణ జరగాలి. దోషులకు శిక్ష పడాలి’ అంటూ మీడియాతో వ్యాఖ్యానించారు.
సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి..
ఒకవైపు కుమారుడు హత్యారోపణలు ఎదుర్కొంటుండగా.. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. గురువారం జైలు అధికారుల జాతీయ కార్యక్రమం (నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ప్రిజన్ అఫీషియల్స్)లో ఆయన పాల్గొన్నారు. దీనికి మొదట మీడియాను ఆహ్వానించగా.. తర్వాత మాత్రం వేదిక వద్దకు మీడియాను రానివ్వకపోవడం గమనార్హం. లఖింపుర్ ఘటనలో ఆశిష్ అరెస్టు ఆలస్యం కావడంపై మీడియా నుంచి మంత్రికి ప్రశ్నలు ఎదురవుతాయనే అంచనాతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం