Omicron: ఒమిక్రాన్పై భయంతో భార్యాపిల్లలను హతమార్చిన వైద్యుడు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో మానసిక అనారోగ్యానికి గురైన ఓ వైద్యుడు భార్యాపిల్లల్ని హతమార్చాడు.......
కాన్పుర్: ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం చోటుచేసుకుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో మానసిక అనారోగ్యానికి గురైన ఓ వైద్యుడు భార్యాపిల్లల్ని హతమార్చాడు. కాన్పుర్లోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా పనిచేస్తున్న సుశీల్.. కల్యాణ్పుర్లోని సొంత అపార్ట్మెంట్లో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ హత్యల వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ.. తన డైరీలో ఓ నోట్ రాశాడు. ‘మహమ్మారి వల్ల కలిగే సవాళ్ల నుంచి విడిపించడం సహా.. వారి కష్టాలన్నింటినీ క్షణాల్లో తొలగించేందుకే ఇలా చేశాను’ అని తన డైరీలో పేర్కొన్నాడు. నయం చేయలేని ఓ వ్యాధితో తాను బాధపడుతున్నట్లు అందులో తెలిపాడు. కొవిడ్ ప్రతి ఒక్కరిని చంపేస్తుందని అందులో పేర్కొన్నాడు. ఈ హత్యల విషయంపై సోదరుడికి ఓ మెసేజ్ కూడా చేశాడు.
కుటుంబ సభ్యుల హత్యలకు పాల్పడిన సుశీల్.. దీని గురించి పోలీసులకు తెలియజేయాలని కోరుతూ తన సోదరుడు సునీల్కు ఫోన్లో ఓ సందేశం పంపాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసిన సునీల్.. వెంటనే అపార్ట్మెంట్కు వెళ్లి చూడగా బయట నుంచి తాళం వేసి ఉంది. అంతలోపే అక్కడకు చేరుకున్న పోలీసులు.. సెక్యూరిటీ గార్డుల సహాయంతో తాళం పగలగొట్టి అపార్ట్మెంట్లోకి ప్రవేశించారు. అక్కడి దృశ్యాలను చూసి నిశ్చేష్టులయ్యారు. వైద్యుడి భార్య చంద్రప్రభ (48) సహా మైనర్లైన కుమారుడు శిఖర్ సింగ్, కుమార్తె ఖుషీ సింగ్ మృతదేహాలు వేర్వేరు గదుల్లో రక్తపు మడుగులో పడి ఉన్నాయి. భార్యను గొంతునులిమి హత్య చేసిన నిందితుడు.. కుమారుడు, కుమార్తెను సుత్తితో కొట్టి హతమార్చాడు. అంతకుముందే వీరందరికీ టీలో మత్తు మందు ఇచ్చాడని.. అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత హత్య చేశాడని పోలీసు అధికారి వెల్లడించారు.
‘తీవ్ర కుంగుబాటుకు గురయ్యా. ఈ సమయంలో నా కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేయలేను. అందుకే కుటుంబం మొత్తానికి విముక్తి కల్పించా. ఒక్క క్షణంలో వారి కష్టాలన్నింటినీ తొలగిస్తున్నా. కరోనా ఎవరినీ అంత సులువుగా విడిచిపెట్టదు. నయంకాని వ్యాధితో బాధపడుతున్న నాకు.. భవిష్యత్తు శూన్యంగా మారింది’ అని సోదరునికి పంపిన సందేశంలో సుశీల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. సుశీల్ను పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు కమిషనర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.