US: అతడ్ని పట్టించినందుకు రివార్డు ఇవ్వండి: కోర్టుకు నిందితుడి ప్రేయసి
గతేడాది క్రిస్మస్ సందర్భంగా అమెరికా నాష్విల్లే డౌన్టౌన్లో పేలుళ్ల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ నేరానికి పాల్పడింది ఆంథోని వార్నర్ అనే వ్యక్తి అని పోలీసులు తేల్చారు......
వాషింగ్టన్: గతేడాది క్రిస్మస్ సందర్భంగా అమెరికా నాష్విల్లే డౌన్టౌన్లో పేలుళ్ల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ నేరానికి పాల్పడింది ఆంథోని వార్నర్ అనే వ్యక్తి అని పోలీసులు తేల్చారు. అయితే ఇప్పుడు ఆ నిందితుడి ప్రేయసి పమేలా పెర్రీ.. తనకు రివార్డ్ ఇప్పించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు డేవిడ్సన్ కౌంటీ ఛాన్సరీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పేలుళ్లకు పాల్పడిన ఆంథోనీ వార్నర్ను గుర్తించేందుకు దర్యాప్తు సంస్థలకు అందించిన సహకారానికి గాను తనకు రావాల్సిన 2,84,000 డాలర్ల రివార్డును వెంటనే చెల్లించాలని ఆమె తన పిటిషన్లో కోరింది. వ్యక్తిగతంగా ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ.. పోలీసులకు సహకరించేందుకు తాను ముందుకు వచ్చానని పేర్కొంది.
రివార్డు ప్రకటించిన పలు సంస్థలు
ఈ దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించిన సమాచారం అందించిన వారికి పలు సంస్థలు అప్పట్లో భారీ రివార్డును ప్రకటించాయి. ‘క్యాంపింగ్ వరల్డ్’ సంస్థ సీఈఓ మార్కస్ లెమోనిస్ 2,50,000డాలర్లు, నాష్విల్లే కన్వెన్షన్, విజిటర్స్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా 34,500 డాలర్లు ఇస్తామని తెలిపాయి. ఇచ్చిన మాట ప్రకారం నాష్విల్లే కన్వెన్షన్, విజిటర్స్ కార్పొరేషన్.. పోలీసులతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలకు 34,500 డాలర్లను అందించాయి. అయితే, వార్నర్ ప్రియురాలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే బాంబు దాడికి పాల్పడిన నిందితుడిని గుర్తించారా? అనే అంశంపై స్పష్టత లేదని నాష్విల్లే కన్వెన్షన్ సీఈఓ స్పైరిడాన్ గతంలోనే పేర్కొన్నారు. పేలుళ్లకు సంబంధించి కచ్చితమైన, విలువైన సమాచారం అందించిన వారికి రివార్డ్ ఇస్తానని చెప్పినట్లు మార్కస్ లెమోనిస్ కంపెనీ పేర్కొంది. నిందితుడిని సజీవంగా పట్టుకోలేదని.. పేలుళ్లలో మరణించాడని గుర్తుచేస్తోంది.
ఫోన్, ఇంటర్నెట్ సేవలు బంద్
గతేడాది డిసెంబర్ 25న నాష్విల్లే అనే ప్రాంతంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతనితో పాటు.. మరో వ్యక్తి మరణించాడు. అనేకమంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. రోజులపాటు ఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరనేది చాలా రోజులపాటు పోలీసులు గుర్తించలేకపోయారు. చివరకు ఆంథోని వార్నర్ అనే ఈ దారుణానికి పాల్పడ్డాడని గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.