Afghanistan: పంజ్షిర్ సరిహద్దుల్లో తాలిబన్ ఫైటర్లు.. ధ్రువీకరించిన అమ్రుల్లా..!
అఫ్గానిస్థాన్లో ఇంకా తమ అధీనంలోకి రాని పంజ్షేర్ లోయను ఆక్రమించుకునేందుకు తాలిబన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
పంజ్షేర్ : అఫ్గానిస్థాన్లో ఇంకా తమ అధీనంలోకి రాని పంజ్షిర్ లోయను ఆక్రమించుకునేందుకు తాలిబన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తనకు తాను అపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ ట్విటర్ వేదికగా ధ్రువీకరించారు. తాలిబన్లు పంజ్షిర్ సరిహద్దులకు చేరుకున్నారని ట్వీట్ చేశారు. అంతకుముందు తాలిబన్లు అందరబ్ లోయలో స్థానిక సేనల ఆకస్మిక దాడులు దెబ్బకు కుదేలయ్యారన్నారు. మరోవైపు లోయకు చేరుకోవాల్సిన ప్రధాన రహదారి సలాంగ్ హైవేను రెసిస్టెన్స్ సేనలు మూసివేశాయని తెలిపారు.
మరోవైపు భారీ స్థాయిలో తాలిబన్ ఫైటర్లు వందల వాహనాల్లో పంజ్షిర్పై దాడికి బయలుదేరినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించినవిగా పేర్కొంటున్న కొన్ని వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు.. తాలిబన్లను స్థానిక సేనలు దీటుగా ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. అందరబ్ ప్రాంతంలో 300 మంది తాలిబన్లు హతమైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది. బీబీసీకి చెందిన ఓ ప్రముఖ పాత్రికేయురాలు చేసిన ట్వీట్ ద్వారా ఈ వార్త ప్రచారంలోకి వచ్చింది. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం వెలువడలేదు.
పంజ్షిర్.. ఓ కొరకరాని కొయ్య
అఫ్గాన్ రాజధాని కాబుల్కు ఉత్తరాన దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో హిందుకుష్ పర్వత శ్రేణుల్లో పంజ్షిర్ ఉంది. జనాభా దాదాపు లక్షన్నర. అందులో అత్యధికులు తజిక్ జాతి ప్రజలు. పంజ్షిర్ అంటే ‘ఐదు సింహాలు’ అని అర్థం. పేరుకు తగ్గట్టే ఇక్కడి ప్రజల్లో తెగువ ఎక్కువ. భౌగోళిక పరిస్థితులు కూడా కలిసివస్తుండటంతో.. పంజ్షిర్ సహజసిద్ధమైన పర్వతాల కారణంగా దుర్బేధ్యమైన కోటగా ఆవిర్భవించింది! 1980ల్లో సోవియట్ సైన్యంగానీ, 1990ల్లో తాలిబన్లుగానీ దీన్ని ఆక్రమించుకోలేకపోయారు. నాటి పోరాటాల్లో దిగ్గజ మిలటరీ కమాండర్ అహ్మద్ షా మసూద్ ఈ లోయ ముజాహిద్దీన్లను ముందుండి నడిపించారు. తాలిబన్లు, అల్ఖైదా ముష్కరులు సంయుక్తంగా కుట్ర పన్ని విలేకరుల వేషంలో ఆత్మాహుతి దాడి జరపడం ద్వారా 2001లో ఆయన్ను పొట్టనపెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అహ్మద్ మసూద్, అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఇక్కడి గడ్డపై తాలిబన్లపై పోరాటానికి వ్యూహాలు రచిస్తున్నారు. తండ్రి బాటలో తాలిబన్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అహ్మద్ మసూద్ ప్రకటించారు. తమ బలగాలకు ఆయుధాలు అందజేయాల్సిందిగా అమెరికాను ఇటీవల ఆయన బహిరంగంగానే కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?