Electric vehicles: అలాంటి రోజులు ఇంకెంతో దూరం లేవు: గడ్కరీ
ప్రపంచంలో విశేష ఆదరణ పొందిన అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ కంపెనీ టెస్లాకి సంబంధించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి .....
దిల్లీ: ప్రపంచంలో విశేష ఆదరణ పొందిన అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ కంపెనీ టెస్లాకి సంబంధించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తే ఆ సంస్థకే ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. దిల్లీలో సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ.. దేశంలో పెట్రోల్ వాహనాల ధరల కన్నా అన్ని ఎలక్ట్రిక్ వాహనాలూ తక్కువ ధరలోనే లభించే రోజులు ఇంకెంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. బయో-ఇథనాల్, సీఎన్జీ, ఎల్ఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల ఉత్పత్తి, వాణిజ్య సంస్థలకు ప్రాధాన్యతా రంగ రుణ సదుపాయాలను విస్తరించనున్నట్టు పేర్కొన్నారు. ఈ చర్యలు శిలాజ ఇంధనాల దిగుమతులను తగ్గించేందుకు దోహదం చేస్తాయన్నారు. పెట్రోల్తో సమానంగా ఇథనాల్ కెలోరిక్ వాల్యూను తీసుకురావాలనే ట్రయల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ద్వారా విజయవంతమైందని తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధనాల ఉత్పత్తి/వాణిజ్యంలో కృషిచేసే వారిని ప్రాధాన్యతారంగ రుణ జాబితాలో చేర్చాలన్న ఆయన.. ఈ అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి, ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడనున్నట్టు తెలిపారు. అలాగైతే.. వారు సులభవంగా రుణాలు పొందగలుగుతారన్నారు.
మరోవైపు, టెస్లా తన కార్లను భారత్లో ఉత్పత్తి చేసేందుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఇటీవల వ్యాఖ్యానించిన గడ్కరీ.. చైనా నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తామంటే మాత్రం కుదరదని ఇటీవల స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ‘‘టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్లో కార్లు ఉత్పత్తి చేస్తామంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. భారత్కు రండి.. ఉత్పత్తి ప్రారంభించండి.. భారత్ అతి పెద్ద మార్కెట్గా ఉంది. .. ఇక్కడి నుంచే ఎగుమతులు కూడా చేసుకోవచ్చు’’ అని ఏప్రిల్ 26న దిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏదైనా పన్ను రాయితీలను పరిశీలించడానికి ముందు టెస్లా కంపెనీ భారత్లో కార్ల ఉత్పత్తి ప్రారంభించాలని గతేడాది కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కూడా స్పష్టంచేసింది. అయితే, జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్లోకి ప్రవేశించేందుకు టెస్లా గత కొంత కాలంగా తహతహలాడుతోంది. తొలుత విదేశాల్లో తయారైన తమ కార్లను భారత్లో విక్రయిస్తామనీ.. తర్వాతే స్థానికంగా తయారీ యూనిట్ను నెలకొల్పుతామని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ చెబుతూ వస్తున్నారు. అంతకంటే ముందు కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలంటూ గత ఏడాది కాలంగా దిల్లీలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ.. భారత్లో పెట్టుబడులకు సంబంధించి సరైన ప్రణాళికను ఆ సంస్థ ప్రకటించకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకుసాగడంలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం