జో-బరాక్.. స్నేహం గురించి తెలుసా?
‘‘మా సోదర ప్రేమ గురించి మాట్లాడుకోవడానికి ఇంటర్నెట్కు ఇదే చివరి అవకాశం’’ అని ఒబమా అనగానే ఆ పక్కనే ఉన్న జోబైడెన్ పగలబడి నవ్వుతూ ఆయన భుజం తట్టారు. ఇది అమెరికా 44వ అధ్యక్షుడు ఒబమా.. నాటి ఉపాధ్యక్షుడు జో బైడెన్కు మధ్య ఉన్న అనుబంధన్ని తెలియజేస్తుంది.
ప్రత్యర్థులుగా మొదలై ప్రాణ స్నేహితులుగా!
(ఫొటోలు జో బైడెన్ ఫేస్బుక్ పేజీ నుంచి)
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
‘‘మా సోదర ప్రేమ గురించి మాట్లాడుకోవడానికి ఇంటర్నెట్కు ఇదే చివరి అవకాశం’’ అని ఒబామా అనగానే ఆ పక్కనే ఉన్న జోబైడెన్ పగలబడి నవ్వుతూ ఆయన భుజం తట్టారు. ఇది అమెరికా 44వ అధ్యక్షుడు ఒబామా.. నాటి ఉపాధ్యక్షుడు జో బైడెన్కు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. 2017 జనవరిలో జోబైడెన్కు అమెరికా అత్యున్నత పురస్కారం ది ‘ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడం’ అందించే సభలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిగా నేను చివరి సారి ప్రెసిడెన్షియల్ పతకాన్ని అందిస్తున్నా అనగానే బైడెన్ వెనక్కి తిరిగి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకొన్నారు. ఇది వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం.
వీరిద్దరి అనుబంధం విచిత్రంగా మొదలైంది. 2008 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని బైడెన్ నిర్ణయించుకొన్నారు. అప్పటికే ఈయనకు సెనెటర్గా దాదాపు 35 ఏళ్ల అనుభవం ఉంది. బైడెన్కు పోటీగా మరో సీనియర్ క్రిస్ డోడ్ కూడా రంగంలోకి దిగారు. అప్పటికే యువకుడైన బరాక్ ఒబామా ఇల్లినాయిస్ సెనెటర్గా మంచి పేరు తెచ్చుకొన్నారు. ఆయన కూడా బరిలోకి దిగారు. ఐయోవాలో నిర్వహించిన కాకస్లో బైడెన్కు ఒకశాతం మాత్రం మద్దతు లభించింది. దీంతో ఆయనకు అర్థమైపోయింది. ఆ తర్వాత రేసు నుంచి వైదొలగారు. బరాక్ రేసులో దూసుకెళ్లి డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. ఆయన ఉపాధ్యక్షుడిగా బైడెన్ను ఎన్నుకొన్నారు. అలా వీరి బంధం మొదలైంది.
ఒబామా అధ్యక్షుడిగా ఉన్న రెండు పర్యాయాలు జోబైడెన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. ప్రతి కీలక సమావేశంలో జో ఒబామా నీడవలే ఉండేవారు. ఆయన తెరపైకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అప్పట్లో అమెరికా పత్రికల్లో వీరిద్దరి సమన్వయాన్ని బ్రోమాన్స్ (సోదర ప్రేమ)గా వర్ణిస్తూ కుప్పలు తెప్పలుగా ఆర్టికల్స్ వచ్చేవి. అప్పట్లో అమెరికా తొలి మహిళ మిషెల్ నేతృత్వంలో నిర్వహించిన ‘లెట్స్ మూవ్’ ప్రచారం కోసం వీరిద్దరు కలిసి ఓ వీడియోలో కూడా నటించారు. అది అప్పట్లో సంచలనం అయింది. ఒబామా పుట్టిన రోజు సందర్భంగా జో బైడెన్ ఒక ఫొటో షేర్ చేశారు. దీనిలో జో-బరాక్ అని రాసి ఉన్న బ్రాస్లెట్ ఉంది.
ఒబామా-బైడెన్ల బంధం ఆఫీస్కు మాత్రమే పరిమితం కాలేదు. ఒకరి కష్టనష్టాలను మరొకరు పంచుకునేంతగా గాఢంగా ఉంది. ఈ విషయాన్ని ఒక సారి బైడెన్ స్వయంగా ఎన్బీసీ ఛానెల్కు చెప్పారు. ‘‘నేను ఒబామాను ఇష్టపడను.. ప్రేమిస్తాను. బ్యూ(బైడెన్ కుమారుడు) చనిపోవడానికి ముందు అనారోగ్యానికి గురైయ్యాడు. అప్పుడు బరాక్ నాకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేయడానికి కూడా ముందుకొచ్చారు’’ అని గుర్తుకు తెచ్చుకొన్నారు. ఒబామా సతీమణి మిషెల్, బైడెన్ సతీమణి జిల్లు సన్నిహత మిత్రురాళ్లు. అలానే బైడెన్ మనవరాళ్లు.. ఒబామా కుమార్తెలకు మంచి దోస్తీ కుదిరింది. వృత్తిపరమైన జీవితానికి దూరంగా వీరి మధ్య బలమైన బంధం ఏర్పడింది. శ్వేతసౌధంలో అధ్యక్షుడికి.. ఉపాధ్యక్షుడికి ఈ స్థాయిలో సంబంధాలు అత్యంత అరుదుగా కనిపిస్తుంది. అందుకే ఒబామా తానే అధ్యక్ష ఎన్నికల్లో నిలబడినట్లు భావించి ఈ ఎన్నికల్లో బైడెన్ కోసం ప్రచారం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు