రైతులతో ఎనిమిదో విడత చర్చలు ప్రారంభం
కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం దిగి రావడంలేదు.. రైతులు వెనక్కి తగ్గడంలేదు.. దీంతో ఈ అంశంలో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం, రైతుల .......
దిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం దిగి రావడంలేదు.. రైతులు వెనక్కి తగ్గడంలేదు.. దీంతో ఈ అంశంలో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు జరిగినా ఈ సమస్య కొలిక్కి రాకపోవడంతో దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళనలు 44వ రోజూ కొనసాగుతున్నాయి. కటిక చలిని, అకాల వర్షాలను సైతం లెక్కచేయకుండా కర్షకులు తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోం ప్రకాశ్ రైతులతో మరోసారి చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల్లో 41 రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే అంశాలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది.
అయితే, సాగు చట్టాల రద్దు మినహా ఏ ప్రతిపాదనైనా పరిశీలిస్తామని చెబుతోన్న కేంద్రం.. ఈ చట్టాలను రైతులు అర్థంచేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే, రైతుల మాత్రం సవరణలకు అంగీకరించేదిలేదని, వెనక్కి తీసుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నాయి. తమ డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభమైన ఎనిమిదో విడత చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్