కొన్ని ఖాతాలను రద్దు చేయలేం: ట్విటర్
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన విషయంలో తప్పుడు, హానికరమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఖాతాలను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ స్పందించింది........
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై స్పందించిన సామాజిక మాధ్యమ సంస్థ
దిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన విషయంలో తప్పుడు, హానికరమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఖాతాలను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ స్పందించింది. తీసుకున్న చర్యలను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాసింది. అలాగే తమ యూజర్ల భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడడం తమ విధి అని అభిప్రాయపడింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ఖాతాలను భారత్లో నిలిపివేశామని ట్విటర్ తెలిపింది. సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, మీడియాకు సంబంధించిన ఖాతాలను మాత్రం రద్దు చేయలేదని స్పష్టం చేసింది. అలా చేయడం భారత చట్టాల ప్రకారం.. భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకమని అభిప్రాయపడింది. చట్టం పరిధిలో భావ ప్రకటనా స్వేచ్ఛను వ్యక్తపరిచేందుకు ట్విటర్ యూజర్లకు ఉన్న హక్కును సమర్థిస్తున్నట్లు తెలిపింది. అలాగే అందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు తీసుకున్న చర్యలను కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వశాఖకు తెలియజేసినట్లు తెలిపింది.
హానికరమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న హ్యాష్ట్యాగ్లు కనపడకుండా చర్యలు తీసుకున్నామని ట్విటర్ తెలిపింది. కేంద్రం పేర్కొన్న వాటిలో మొత్తం 500 ఖాతాలపై చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. ట్విటర్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న కొన్నింటిని శాశ్వతంగా రద్దు చేసినట్లు పేర్కొంది.
రైతుల ఆందోళనపై కొందరు సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వశాఖ పేర్కొంది. అలా తప్పుడు సమాచారం చేరవేసే 1178 ఖాతాలను నిలిపివేయాలని, ఆ ట్వీట్లను వెంటనే తొలగించాలని ట్విటర్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తీసుకున్న చర్యలను వివరిస్తూ ట్విటర్ తాజాగా కేంద్రానికి లేఖ రాసింది.
ఇవీ చదవండి....
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.