చేతులు జోడించి అడుగుతున్నా..పోలింగ్ కుదించండి!
పశ్చిమ బెంగాల్లో మరో మూడు దశల్లో జరగాల్సిన ఎన్నికలను ఒకేరోజు జరపాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి విజ్ఞప్తి చేశారు.
మిగతా మూడు దశలను ఒకేరోజు నిర్వహించాలి
ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ విజ్ఞప్తి
కోల్కతా: పశ్చిమ్బెంగాల్లో మరో మూడు దశల్లో జరగాల్సిన ఎన్నికలను ఒకేరోజు జరపాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోన్న దృష్ట్యా పోలింగ్ షెడ్యూల్పై ఈసీ పునరాలోచించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దీదీ, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ దశలను కుదించాలని ఈసీని అభ్యర్థించారు.
‘మరో మూడు దశల్లో జరగాల్సిన పోలింగ్ను ఒకేరోజు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చేతులు జోడించి ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిస్తున్నా. ఒకవేళ ఒకరోజులో సాధ్యం కాకుంటే కనీసం రెండు రోజుల్లోనైనా నిర్వహించండి’ అని ఉత్తర్ దినాజ్పూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమతా బెనర్జీ ఈసీకి విజ్ఞప్తి చేశారు. భాజపా చెప్పిన విధంగా నిర్ణయాలు తీసుకోకూడదని.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ రోజులను కుదించాలని కోరారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఉన్నందున తాను, తమపార్టీ నేతలు ఇరుకైన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదని నిర్ణయించినట్లు మమతా బెనర్జీ వెల్లడించారు. అయితే, పోలింగ్ తేదీలను కుదించి ఒకేరోజు ఎన్నికలు జరపాలని వస్తోన్న డిమాండ్పై ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితమే స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి ఎన్నికల షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదని ప్రకటించింది.
ఇక కరోనా ఉద్ధృతితో పాటు వ్యాక్సినేషన్ను సరిగా చేపట్టడంలేదని మోదీ ప్రభుత్వంపై మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. వ్యాక్సిన్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు గడిచిన ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు. భాజపా పార్టీని అల్లర్లు, గొడవలు సృష్టించే పార్టీగా ఆరోపించిన దీదీ.. ఒకవేళ వారిని(భాజపా) రాష్ట్రంలోకి అనుమతిస్తే బెంగాల్ను గుజరాత్లాగా మారుస్తారని ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, పశ్చిమ్బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుండగా ఇప్పటికే ఐదు దశల్లో 180స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది. మరో 114 స్థానాలకు మరో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.