US Congress: ఇక భారత్లోనే జీఈ విమాన ఇంజిన్ల తయారీ.. అమెరికా కాంగ్రెస్ గ్రీన్సిగ్నల్
భారత (India) దేశీయ ఫైటర్ జెట్ల తయారీలో భారీ ముందడుగు పడింది. దీంతో చైనా (China) ఫైటర్ విమానాలు ఏమాత్రం పోటీపడలేనంత నాణ్యమైన ఇంజిన్లను దేశీయంగా తయారు చేయనుంది. సరిహద్దుల్లో భారత్తో ఘర్షణల వేళ చైనాకు ఇది ఏమాత్రం మింగుడుపడని అంశంగా మారనుంది.
ఇంటర్నెట్ డెస్క్: యుద్ధవిమానాల తయారీ రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. జనరల్ ఎలక్ట్రిక్ (GE) సంస్థ.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)తో కలిసి భారత్లోనే ఎఫ్414 ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేయాలన్న ప్రతిపాదనకు అమెరికా కాంగ్రెస్ (US Congress) ఆమోదముద్ర వేసింది. ఈ ఇంజిన్లను భారత వాయుసేన కోసం వినియోగించనున్నారు.
జూన్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ డీల్పై సంతకాలు జరిగాయి. తాజాగా ఆ ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ కూడా ఆమోదముద్ర వేసింది. దీంతో అమెరికాకు చెందిన అత్యున్నత శ్రేణి జెట్ ఇంజిన్లను భారత్లోనే తయారు చేయడానికి మార్గం సుగమమైంది. ఈ ఒప్పందం కింద దాదాపు 80శాతం టెక్నాలజీని జీఈ భారత్కు బదలాయిస్తుంది. దీంతో భారత వాయుసేన ఉపయోగించే తేజస్ ఎంకే2కు అవసరమైన ఇంజిన్ల తయారీ సులువవుతుంది. ఈ భాగస్వామ్యం ఓ పెనుమార్పునకు నాంది పలుకుతుందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సీబీ అనంత కృష్ణన్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దేశీయంగానే తయారు చేసిన విమాన ఇంజిన్లను మన జెట్లకు అందించేందుకు ఇది పునాది వేస్తుందని వివరించారు. ఈ కొత్త ఒప్పందం ప్రకారం 99 ఇంజిన్లను జీఈ-హల్ సంయుక్తంగా నిర్మించాల్సి ఉంటుంది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కారణంగా వీటిని అతి తక్కువ ధరలోనే నిర్మించడం సాధ్యమవుతుంది. ఎఫ్414 ఇంజిన్ను ఇప్పటి వరకు ప్రపంచంలోని పలు అత్యుత్తమ ఫైటర్జెట్లు వినియోగించాయి.
చైనాకు అవస్థలే..
చైనా టెక్నాలజీలో ఎంత ముందున్నా.. ఇప్పటి వరకు సొంతంగా ఫైటర్ జెట్ ఇంజిన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. జే-20 ఫైటర్ జెట్ల కోసం ఆ దేశం సొంతంగా షెన్యాంగ్ డబ్ల్యూ-10 ఇంజిన్లను అభివృద్ధి చేసినా.. అవి పశ్చిమదేశాల ఇంజిన్లతో పోటీ పడే స్థాయిలో లేవు. రష్యాకు చెందిన ఏల్-31 శ్రేణి ఇంజిన్ల టెక్నాలజీ కాపీతో వాటిని తయారు చేసింది. ప్రస్తుతం ఈ ఇంజిన్లను సు-30 విమానాల్లో వాడుతున్నారు. షెన్యాంగ్ డబ్ల్యూ-10 సామర్థ్యం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో డబ్ల్యూ-15 రకంపై చైనా దృష్టిపెట్టింది. వీటి పనితీరు అద్భుతంగా ఉందని బీజింగ్ చెబుతున్నా.. ఎక్కడా నిరూపించుకోలేదు.
ఇక భారత్లో ఎఫ్414 ఇంజిన్ల తయారీ మొదలైతే.. చైనాకు ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుంది. ఈ ఇంజిన్లను ఇప్పటికే ఏవియేషన్ సూపర్ పవర్ అయిన అమెరికా తన నౌకాదళంలోని ఎఫ్-18 సూపర్ హార్నెట్, ఈఏ-18జీ గ్రౌలర్, ఐరోపాకు చెందిన సాబ్ కంపెనీ తయారీ గ్రిపిన్ ఫైటర్ జట్లకు వినియోగిస్తోంది. వీటినే మన తేజస్లో కూడా వాడనున్నారు.
భారత్కు కొరకరాని కొయ్యగా ఇంజిన్..
ఇప్పటి వరకు భారత్ గత కొన్ని దశాబ్దాలుగా వైమానిక రంగంలో చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. విమానాలు, హెలికాప్టర్ల డిజైనింగ్లో ముందడుగు వేసింది. దీంతోపాటు రాడార్లు, ఏవియానిక్స్, ఆయుధాలను తయారు చేసింది. కానీ, ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీలో మాత్రం ఏమాత్రం ముందడుగు వేయలేదు. ప్రపంచ వ్యాప్తంగా జీఈ, ప్రాట్ అండ్ విట్నీ, రోల్స్రాయిస్, శాఫ్రన్ కంపెనీలు అత్యంత నాణ్యమైన ఇంజిన్లను తయారు చేయగలవు. రష్యా సంస్థలు ఇంజిన్లు తయారు చేసినా.. పశ్చిమదేశాల ఇంజిన్లతో పోలిస్తే వాటి జీవితకాలం, సామర్థ్యం, నాణ్యత ఇతర అంశాలు అంతగొప్పగా ఉండవు. మాస్కో ఇంజిన్ల కంటే జీఈ ఇంజిన్ల జీవిత కాలం చాలా ఎక్కువ. అంతేకాదు.. అమెరికా తన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలతో కలిసి మాత్రమే సంయుక్తంగా ఇంజిన్లను తయారు చేస్తోంది. జపాన్, జర్మనీతో కలిసి ఇంటర్నేషనల్ ఏరో ఇంజిన్స్ పేరిట, ఫ్రాన్స్తో కలిసి సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ సంస్థగా ఏర్పడి ఉత్పత్తి చేస్తోంది. తాజాగా ఆ జాబితాలో భారత్ కూడా చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365