Delhi: దిల్లీలో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత.. రెస్టారంట్లు, థియేటర్లకు 50%వెసులుబాటు
కరోనా ఉద్ధృతి నుంచి దేశ రాజధాని దిల్లీ కాస్త కోలుకుంటోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే వైరస్ కట్టడి కోసం విధించిన
ఆంక్షలు సడలించిన ఆప్ సర్కారు
దిల్లీ: కరోనా ఉద్ధృతి నుంచి దేశ రాజధాని దిల్లీ కాస్త కోలుకుంటోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే వైరస్ కట్టడి కోసం విధించిన ఆంక్షలను ఆప్ సర్కారు సడలించింది. వారాంతపు కర్ఫ్యూతో పాటు, దుకాణాలపై సరి-బేసి విధానాన్ని ఎత్తివేసింది. అంతేగాక, సినిమా హాళ్లు, రెస్టారంట్లు సగం సామర్థ్యంతో నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది.
కరోనా ఉద్ధృతి అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అధ్యక్షతన దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) గురువారం సమావేశమైంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. దీనిలో భాగంగానే ఆంక్షల సడలింపులపై నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘‘వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేస్తున్నాం. అయితే, రాత్రిపూట మాత్రం కర్ఫ్యూ కొనసాగుతోంది. దుకాణాలను సరి-బేసి విధానాన్ని తొలగిస్తున్నాం. ప్రతి రోజూ దుకాణాలు తెరుచుకుంటాయి. బార్లు, రెస్టారంట్లు, హోటళ్లు, సినిమా థియేటర్లు 50శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతి మంజూరు చేస్తున్నాం. వివాహాది శుభాకార్యాల్లో గరిష్ఠంగా 200 మంది మాత్రమే పాల్గొనవచ్చు’’ అని అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కూడా 50శాతం ఉద్యోగులతో నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతానికి స్కూళ్లు, విద్యా సంస్థలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వచ్చే సమావేశంలో దీనిపై చర్చిస్తామని, అప్పటి వరకూ స్కూళ్ల మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రోజువారీ కేసులు 5వేల దిగువకు..
ఒమిక్రాన్ వ్యాప్తితో ఇటీవల కరోనా మహమ్మారి విజృంభించిన విషయం తెలిసిందే. రోజువారీ కేసులు ఏకంగా 25వేల వరకు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 30శాతం దాటేసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూతో సహా పలు ఆంక్షలు విధించింది. సినిమా థియేటర్లు, స్కూళ్లు, రెస్టారంట్లను పూర్తిగా మూసివేసింది. దీంతో వైరస్ వ్యాప్తి కొంత మేరకు అదుపులోకి వచ్చింది. ఇటీవల కొన్ని రోజులుగా కేసులు తగ్గుముఖం పడుతోంది. గురువారం కొత్త కేసులు 5వేల లోపే నమోదు కావొచ్చని దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ అంచనా వేశారు. పాజిటివిటీ రేటు కూడా 10శాతం దిగువకు పడిపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?