పరిస్థితి చేజారితే లాక్డౌన్ తప్పదు..!
ఆసుపత్రుల్లో పరిస్థితి దిగజారితే మాత్రం లాక్డౌన్ అమలు చేయడం మినహా ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్ తీవ్రత పెరిగిన నేపథ్యంలో మరిన్ని ఆంక్షలవైపు దిల్లీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొవిడ్ రోగులతో దిల్లీలోని ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగి.. ఆసుపత్రుల్లో పరిస్థితి దిగజారితే మాత్రం లాక్డౌన్ అమలు చేయడం మినహా ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. దేశ రాజధానిలో కరోనా వైరస్ నాలుగో వేవ్ ఉద్ధృతి ప్రమాదకరంగా కనిపిస్తుందన్న కేజ్రీవాల్.. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.
‘మునుపటి విజృంభణ కంటే కరోనా నాలుగో ఉద్ధృతి అత్యంత ప్రమాదకరం. వైరస్ విస్తృతిపై పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది’ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం దిల్లీలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయని.. పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలనుకోవడం లేదన్నారు. కానీ, ఒకవేళ ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగి.. పరిస్థితి దిగజారితే మాత్రం లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదని అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.
వైద్య విద్యార్థులూ రంగంలోకి..
దిల్లీలో గతకొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరగడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల కొరత ఏర్పడుతోంది. దీంతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. ముందుజాగ్రత్త చర్యగా ఎంబీబీఎస్ మూడు, నాలుగో ఏడాది చదివే విద్యార్థులు, ఇంటెర్న్షిప్ చేస్తున్న వారితో పాటు బీడీఎస్ వైద్యుల సేవలు కూడా వినియోగించుకోవాలని అన్ని కొవిడ్ ఆసుపత్రుల అధికారులకు దిల్లీ ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు.
గడిచిన రెండు వారాలుగా దిల్లీలో కరోనా వైరస్ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 10వేలు దాటింది. ప్రస్తుతం అక్కడ 28వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. దీంతో నగరంలో మరిన్ని కొవిడ్ ఆంక్షలను విధిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా సామాజిక, రాజకీయ, క్రీడలు, సినిమా, మతపరమైన సమావేశాలు, వేడుకలపై నిషేధం విధించింది. ఇక తదుపరి ఆదేశాలిచ్చే వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేసి ఉంచాలని రెండు రోజుల క్రితమే ఆదేశాలు వెలువరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Lalu Prasad Yadav: రాజకీయాల్లోకి లాలూ మరో కుమార్తె..?
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమార్తె రోహిణి ఆచార్యను ఆర్జీడీ కంచుకోట అయిన సరన్ నుంచి ఎన్నికల బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు పార్టీ సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. -
Rahul Gandhi: నా వ్యాఖ్యలను వక్రీకరించారు : రాహుల్
తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ వక్రీకరించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. -
Chennai Super Kings: అన్నాడీఎంకేకు 80% విరాళాలు.. సీఎస్కే యాజమాన్యం నుంచే
Chennai Super Kings: ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ఎన్నికల బాండ్ల రూపంలో అన్నాడీఎంకేకు భారీగా విరాళం ఇచ్చినట్లు తెలిసింది. -
Sadananda: కాంగ్రెస్లోకి సదానంద గౌడ..? మనసులో మాట చెబుతానన్న మాజీ సీఎం
తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని భాజపా సీనియర్ నేత సదానంద గౌడ(Sadananda) అన్నారు. -
Sanjay Singh: ‘ప్రమాణ స్వీకారానికి జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లండి’ - దిల్లీ కోర్టు
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సంజయ్ సింగ్ ప్రమాణస్వీకారం కోసం మార్చి 19న తిహాడ్ జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లాలని దిల్లీ కోర్టు ఆదేశించింది. -
సంక్షోభం వేళ నీటి ఆదాకు బెంగళూరు డాక్టర్ ‘4 టిప్స్’.. రోజుకు 600 లీటర్లు సేవ్ చేశారట..!
Bengaluru Water Crisis: బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ కొన్ని టిప్స్తో రోజుకు 600 లీటర్లు నీటిని ఆదా చేశారట. వాటిని ఆమె వివరించగా.. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఆ టిప్స్ ఏంటో మీరే చూడండి..! -
Himachal Pradesh: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ
రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ ధిక్కరించి క్రాస్ ఓటింగ్కి పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. -
Google: చిన్నప్పటి ఫొటోతో గూగుల్ అకౌంట్ బ్లాక్.. హైకోర్టు నోటీసులు
Google account: చిన్నప్పటి ఫొటోను అప్లోడ్ చేసిన కారణంగా గూగుల్ ఓ వ్యక్తి అకౌంట్ను బ్లాక్ చేసింది. దీనిపై అతడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. -
ECI: బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ‘ఈసీ’ వేటు
ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ల హోంశాఖ కార్యదర్శులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. -
‘నేను సోనియాగాంధీతో భేటీ కాలేదు.. అది రాహుల్ పొలిటికల్ స్టంట్’: అశోక్ చవాన్
ఇటీవల కాంగ్రెస్(Congress)ను వీడిన సీనియర్ నేతలను ఉద్దేశించి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం అశోక్ చవాన్ స్పందించారు. -
Satyendar Jain: ఆప్నేత సత్యేందర్ జైన్కు సుప్రీంలో చుక్కెదురు
మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్దే చోరీ.. తర్వాత సీన్ రివర్స్!
ఒంటరిగా ఉన్న వ్యక్తిని అదును చూసి ఇద్దరు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కావడంతో వారి సీన్ రివర్స్ అయింది. -
Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాల్సిందే.. ఎస్బీఐకి సుప్రీం డెడ్లైన్
Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లను ఈసీకి ఇవ్వకపోవడంతో ఎస్బీఐపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. మార్చి 21లోగా అన్ని వివరాలు ఇవ్వాల్సిందేనని డెడ్లైన్ విధించింది. -
Electoral Bonds: నా విరాళాలు వారికిచ్చాను.. ఎన్నికల బాండ్లపై కిరణ్ మజుందార్ షా
Electoral Bonds: వ్యక్తిగత హోదాలో ఎన్నికల బాండ్ల ద్వారా తాను కొన్ని పార్టీలకు నామమాత్రపు విరాళాలిచ్చినట్లు బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా వెల్లడించారు. -
S Jaishankar: ‘స్నేహమంటే అదే కదా’: నేవీ ఆపరేషన్పై జై శంకర్ ఆసక్తికర రిప్లై
హైజాక్ అయిన నౌక నుంచి 17 మంది బందీలను మన నౌకాదళం విడిపించింది. ఇందుకు బల్గేరియా దేశం ధన్యవాదాలు తెలిపింది. -
Arvind Kejriwal: దిల్లీ జల్బోర్డు కేసులోనూ.. ఈడీ సమన్లకు కేజ్రీవాల్ డుమ్మా
Arvind Kejriwal: దిల్లీ జల్బోర్డుకు సంబంధించిన కేసులోనూ ఈడీ విచారణకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు.ఆ సమన్లు అక్రమమని ఆరోపించారు. -
Russia: మమ్మల్ని విడిపించండి ప్లీజ్: రష్యా నుంచి భారతీయుల మరో వీడియో
Indians Stuck In Russia: రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
Rahul Gandhi: ‘ఆయన మా అమ్మకు ఫోన్ చేసి కన్నీటిపర్యంతమయ్యారు’: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
ఇటీవల కాంగ్రెస్(Congress)ను వీడిన సీనియర్ నేతలను ఉద్దేశించి.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎన్డీయే కూటమిపై విమర్శలు చేశారు. -
వారికి అమెరికా పౌరసత్వం ఇస్తుందా?: హరీశ్ సాల్వే
భారత్ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయడంపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేయడాన్ని సీనియర్ న్యాయవాది, మాజీ సోలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే తప్పుపట్టారు. ప్ -
కోడ్ మీరితే కొరడా!
భారతదేశంలో ఎన్నికలు ఓ మహాసంగ్రామం! గెలుపే లక్ష్యంగా పార్టీలు ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తుంటాయి. -
బెట్టింగ్ యాప్ కుంభకోణం.. భూపేశ్ బఘేల్పై కేసు
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్పై రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
Lalu Prasad Yadav: రాజకీయాల్లోకి లాలూ మరో కుమార్తె..?
-
Nalgonda: ఎన్నికల కోడ్.. మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల బంగారం పట్టివేత
-
BJP: జితేందర్రెడ్డి, రంజిత్రెడ్డి ఏ లబ్ధికి కాంగ్రెస్లోకి వెళ్లారు?: రఘునందన్రావు
-
Social Look: ‘ఫ్రెష్’ ఫీలింగ్తో ప్రగ్యా.. బ్రదర్కి అనుపమ విషెస్.. చీరలో అదితి, ఐశ్వర్య హొయలు
-
Rahul Gandhi: నా వ్యాఖ్యలను వక్రీకరించారు : రాహుల్
-
NDA: బిహార్లో ‘ఎన్డీయే’ సీట్ల పంపకం పూర్తి.. అధిక స్థానాల్లో భాజపా పోటీ