వుహాన్ ప్రపంచంలోనే సురక్షితమైన నగరం !
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున చైనాలో వుహాన్ నగరంలో మొదటి కరోనా మరణం నమోదైంది.
నగర ప్రజల ఆనందం
బీజింగ్: సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున చైనాలో వుహాన్ నగరంలో మొదటి కరోనా మరణం నమోదైంది. 12 నెలల్లో ప్రపంచమంతా ఆ సంఖ్య 20 లక్షలకు చేరువైంది. ఈ ఏడాది కాలంలో ప్రపంచంలో ఏదో ఒక మూల కరోనా కారణంగా ప్రజలు మృత్యుఒడికి చేరుకుంటూనే ఉన్నారు. భౌతికదూరం, మాస్కులు వంటి నిబంధనలు పాటిస్తూనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తికి కారణమైన వుహాన్ నగరం మాత్రం ఇప్పుడు సురక్షితమైన ప్రదేశంగా మారిపోయింది.
ఏడాది క్రితం మొదటి మృతి సంభవించిందనే ఛాయలు లేకుండా..వుహాన్ ప్రజలు ఎటువంటి నిబంధనలు లేకుండా వాళ్ల పనులు చక్కబెట్టుకుంటున్నారు. జనవరి 11, 2020న 61 ఏళ్ల వ్యక్తి గుర్తుతెలియని వైరస్తో మరణించినట్లు చైనా ఓ నివేదికలో ప్రకటించింది. అయితే మృతుడి వివరాలపై మాత్రం ఇప్పటికీ సరైన స్పష్టత లేదు.
ఇదిలా ఉండగా..కరోనా నుంచి తమ వుహాన్ నగరానికి విముక్తి లభించడంపై అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వుహాన్ చైనాలో అత్యంత సురక్షితమైన ప్రదేశం. ప్రపంచంలో కూడా. అంటువ్యాధుల నివారణ గురించి వుహాన్ ప్రజలకు అవగాహన ఎక్కువ. చివరకు నా రెండేళ్ల మనవడు కూడా బయటకు వెళ్లేప్పుడు మాస్క్ ధరిస్తాడు’ అని గ్జియాంగ్ లియాన్షెంగ్(61) మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే వ్యక్తుల ద్వారా చైనాలో కేసులు నమోదవుతున్నాయి. మా దేశం వైరస్పై నియంత్రణ సాధించింది. వుహాన్ నగర ప్రజలందరూ సురక్షితంగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు. మేం రోజూ ఇక్కడికు వచ్చి డ్యాన్స్ చేస్తున్నాం’ అని 80 ఏళ్ల ఝాంగ్ అనే మహిళ వెల్లడించారు. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కఠినమైన లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తోన్న తరుణంలో..ఆ నగర ప్రజలు మాత్రం షికార్లకు వెళ్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిపై సరైన సమాచారం ఇవ్వలేదని స్వదేశంలోనూ, అంతర్జాతీయంగా చైనా విమర్శలను ఎదుర్కొంది. గత ఏడాది ప్రారంభంలో కేసులు గురించి వెల్లడించడంలో విఫలమైందని, దానిపై శోధించిన వారిని కట్టడి చేసిందనే ఆరోపణలను ఎదుర్కొంది. వుహాన్లో మొదటి మరణం సంభవించిన రెండువారాలకు ప్రభుత్వం ఆ నగరంతో పాటు, పరిసర ప్రాంతాలను కఠినమైన లాక్డౌన్ పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ కఠిన చర్యలతో వైరస్ను అదుపులోకి తీసుకువచ్చింది. గతేడాది జనవరి చివర్లో ప్రారంభమైన లాక్డౌన్కు ఏప్రిల్లో ముగింపు పలికింది అక్కడి ప్రభుత్వం. దాంతో మహమ్మారిని అద్భుతంగా నియంత్రించిన దేశంగా చైనా నిలిచింది. అమెరికాలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో సుమారు నాలుగు వేల మరణాలు సంభవిస్తుంటే..చైనాలో మొత్తం మృతుల సంఖ్య 4,634గా ఉండటం గమనార్హం. సమర్థవంతగా కట్టడి చేసినప్పటికీ, ఇటీవల కాలంలో ఆ దేశంలో కూడా కేసుల పెరుగుదల కనిపిస్తోంది. సోమవారం ఒక్కరోజే 103 మందికి పాజిటివ్గా తేలింది. ఇది గతేడాది జులై నుంచి ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. మరోవైపు, వైరస్ మూలాలపై దర్యాప్తు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందానికి చైనా ఎట్టకేలకు అనుమతులు ఇచ్చింది.
ఇవీ చదవండి:
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం